తేల్చుకుందామని సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్ !

వైసీపీని ధిక్కరించి ఏపీలో ఉంటున్నారంటే వారికి మూడినట్లే. అందుకే రఘురామకృష్ణరాజు ఏపీకి రావాలని భయపడుతున్నారు. చట్టాలు..రాజ్యాంగాలు ఏవీ కాపాడలేవని ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన పై కేసులు పెట్టి అరెస్టు చేయిస్తామని మొదట్లో లీకులు ఇస్తే.. సరే రండి అని ఆయన సవాల్ చేశారు. భయపడటం లేదేమోనని ఆయన అనుచరులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నరు. ఈ అంశంపై శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సజ్జలపై మండిపడ్డారు.

రాష్ట్రం మొత్తం ఎన్నో సమస్యలు ఉంటే అవన్నీ కాదని.. నెల్లూరు రూరల్‌పై దృష్టి పెట్టారని.. తనపై కక్షకట్టారని..తనపై అక్రమ కేసులు పెట్టటంతో పాటు తన అనుచరులపై కూడా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని కేసులు పెట్టినా తాను గానీ..తన అనుచరులు గానీ ఏమాత్రం భయపడేది లేదని స్పష్టంచేశారు కోటంరెడ్డి. సీఎం జగనే అయినా షాడో ముఖ్యమంత్రి మాత్రం సజ్జలేనని స్పష్టం చేశారు. ఆయనే ఆదేశాలతోనే తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని..తనను భయపెట్టటానికి చూస్తున్నారని ఇటువంటి చిల్లర రాజకీయాలన్నీ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే చూశానని భయం అనేది నా బ్లడ్ లోనే లేదంటూ మండిపడ్డారు కోటంరెడ్డి.

నన్ను కేసులతో బెదిరించాలని నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు. ముఖ్య అనుచరుడు తాటి వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారని..అతనితో పాటు జావేద్ లను అరెస్ట్ చేశారని కానీ వీరి అరెస్ట్ లపై పోలీసులు ఎటువంటిసమాచారం ఇవ్వలేదని అన్నారు
తానిప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మరాను కాబట్టి నాలుగు నెలల క్రితం కేసు కానిది ఇప్పుడు కేసు అయ్యిందని ఇవి ప్రభుత్వం చేసే వ్యవహరాలు అంటూ మండిపడ్డారు. ఎలాంటి పరిణామాలను అయినా ఎదుర్కొనేందుకు రెడీ అని అయన సవాల్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close