ఔను.. అక్క‌డికి తాగి వెళ్లా!

ఒక‌ప్పుడు క‌మెడియ‌న్ కృష్ణ‌భ‌గ‌వాన్ లేకుండా సినిమానే ఉండేది కాదు. హీరో ప‌క్క‌నో, విల‌న్ చెంత‌నో నిల‌బ‌డి సెటైర్లు మీద సెటైర్లు వేసేవాడు. ఈమ‌ధ్య మాత్రం కృష్ణభ‌గ‌వాన్‌ని వెదుక్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సినిమాల్లేవు. వ‌చ్చినా ఇది వ‌ర‌క‌టిలా పంచ్‌లు పేల‌డం లేదు. దానికి తోడు వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న కూడా త‌న కెరీర్‌ని పాతాళంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ క‌మెడియ‌న్ తాగుడుకి బానిసైపోయాడ‌ని, అది ఆరోగ్యంపై ప్ర‌భావం చూపించ‌ద‌ని, అందుకే అవ‌కాశాలూ దూర‌మయ్యాన‌ని చెప్పుకొంటున్నారు. ఆమ‌ధ్య ఓ కాలేజీ ఫంక్ష‌న్‌కి తాగి వెళ్లి.. వేదిక‌పై ఏదోదో వాగి మ‌రింత అభాసుపాలయ్యాడు. ఆ ఎపిసోడ్ కృష్ణ‌భ‌గ‌వాన్ కూడా గుర్తు చేసుకొన్నాడిప్పుడు.

”అవును.. ఆ కాలేజీ ఫంక్ష‌న్‌కి నేను తాగి వెళ్లా. కానీ.. అలా వెళ్లింది అదొక్క‌సారే. ఆ పొర‌పాటు మ‌రోసారి జ‌ర‌గ‌నివ్వ‌ను. నా ఆరోగ్యం ప్ర‌స్తుతం బాగానే ఉంది. త్వ‌ర‌లోనే మునిప‌టిలా సినిమాల్లో మెరుస్తాన‌న్న న‌మ్మ‌కం ఉంది” అంటున్నాడు. అయితే కుర్ర క‌మెడియ‌న్ల జోరు, జ‌బ‌ర్ ద‌స్త్ గ్యాంగ్ ముందు కృష్ణ‌భ‌గ‌వాన్ నిల‌బ‌డ‌తాడా అన్న‌ది సందేహ‌మే. మునుప‌టిలా పంచ్‌లో జోరు చూపించాలంటే… అలాంటి మంచి పాత్ర‌లు ప‌డాలి. వాటికోస‌మే కృష్ణ‌భ‌గ‌వాన్ వెయిటింగ్ చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close