కృష్ణంరాజు తీర‌ని కోరిక‌లు

కృష్ణంరాజు జీవితంలో అన్నీ చూసేశారు. న‌టుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ నాయకుడిగా, తండ్రిగా, వ్య‌క్తిగా, భ‌ర్తగా అన్ని పాత్ర‌ల్నీ స‌మ‌ర్థంగా పోషించారు. అయితే కొన్ని కోరిక‌లు తీర‌లేదు. భ‌క్త‌క‌న్న‌ప్ప సినిమాని ప్ర‌భాస్ తో రీమేక్ చేద్దామ‌నుకొన్నారు. స్క్రిప్టు కూడా త‌యారు చేసుకొన్నారు. ఆ సినిమాకి తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, నిర్మించాల‌న్న‌ది ఆశ‌. కానీ కుద‌ర్లేదు. `ఒక్క అడుగు` పేరుతో ఓ కథ సిద్ధం చేశారు. ఐదుగురు హీరోల మ‌ల్టీస్టార‌ర్ ఈ సినిమా. అందులో ప్ర‌భాస్‌కీ ఓ పాత్ర ఉంది. ఇండ‌స్ట్రీలోని చాలా మంది పెద్ద ర‌చయిత‌లు ఈ క‌థ‌పై క‌స‌ర‌త్తు చేశారు. కానీ.. ఇది కూడా ప‌ట్టాలెక్క‌లేదు. గ‌వ‌ర్న‌ర్ గా ప‌నిచేయాల‌ని కృష్ణంరాజుకి ఉండేది. ఆమ‌ధ్య కృష్ణంరాజుని గ‌వ‌ర్న‌ర్ చేస్తార‌ని వార్త‌లొచ్చాయి. ఓసారైతే.. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అయిపోయార‌ని కూడా అన్నారు. కానీ అది కూడా తీర‌లేదు. విశాల నేత్రాలు అనే న‌వ‌లంటే కృష్ణంరాజుకి చాలా ఇష్టం. ఆ న‌వ‌ల‌ని సినిమాగా తీయాల‌నుకొన్నారు. కానీ అది కూడా కుద‌ర్లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్ర‌భాస్ పెళ్లి చేయాల‌ని ఆయ‌న చాలా ఆశ ప‌డ్డారు. ప్ర‌తీ యేడాది… `ఈ సంవ‌త్స‌రం ప్ర‌భాస్‌కి పెళ్లి చేసేస్తా` అంటూనే ఉండేవారు. కానీ.. అది కూడా నెర‌వేర‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close