తమ వర్గం మీద జగన్ కక్ష సాధింపు పై క్షత్రియ సంఘం ఆవేదన

అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించడం, కరోనా సమయంలో విపత్తు నిర్వహణ కంటే రాజకీయ కక్ష సాధింపు పై ప్రభుత్వం దృష్టి పెట్టడం సబబు కాదని విపక్షాలు విమర్శించడం, ఈలోగా కస్టడీలో ఉన్న తనపై పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారంటూ రఘురామకృష్ణంరాజు కోర్టుకు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం, హైకోర్టు దీనిపై స్పందించడం తెలిసిందే. అయితే పనిగట్టుకొని తమ సామాజిక వర్గం పై జగన్ కక్ష సాధిస్తున్నాడు అంటూ క్షత్రియ సంఘం నేతలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రామరాజు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం క్షత్రియ సామాజిక వర్గం పై కక్ష సాధిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే క్షత్రియులంతా వైఎస్ఆర్సిపి పార్టీ పై తిరగబడతారని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో సైతం సదరు సామాజిక వర్గం జగన్ పాలనలో తమ వర్గం నేతలను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందని వాపోతున్నారు. క్షత్రియ సంఘం అధినేత తో పాటు అదే వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణ రాజు కూడా జగన్ క్షత్రియ సామాజిక వర్గం వారిపై కావాలనే దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అశోక్ గజపతిరాజు ఉదంతాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. అశోక్ గజపతి రాజు కు సంబంధించిన వ్యవహారాలలో జగన్ జోక్యం చేసుకోవడం, ట్రస్ట్ విషయంలో సామాజిక వర్గ మనోభావాలకు విరుద్ధంగా జగన్ నిర్ణయాలు తీసుకోవడం ప్రస్తుతం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

అదేవిధంగా రామలింగరాజు ని అప్పట్లో వైయస్ కుటుంబం బలిపశువును చేసిందంటూ మరి కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో సత్యం రామలింగ రాజు వైయస్సార్ ల మధ్య లావాదేవీలు ఉండేవని, అయితే పరిస్థితి చేజారి పోయాక వైయస్ కుటుంబం సత్యం రామ లింగరాజు ని లొంగి పొమ్మని చెప్పి తాము మాత్రం సేఫ్ అయిపోయారని, రామలింగరాజు ని బలిపశువును చేశారని వారు ఆరోపణ లు చేస్తున్నారు. తండ్రి వైయస్ హయాంలో తమ సామాజిక వర్గానికి ఐకాన్ లాంటి రామలింగరాజు సామ్రాజ్యం కూలిపోతే కొడుకు జగన్ హయాంలో తమ వర్గానికి చెందిన ఎంపీ ని, తన వయసు కు కూడా మర్యాద ఇవ్వకుండా పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అని వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే రాజద్రోహం అయితే చంద్రబాబు హయాంలో చంద్రబాబు ని నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్ వ్యాఖ్యలు చేసి ఉన్నాడని, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా అనేకసార్లు అనేక రకాల వ్యాఖ్యలు జగన్ చేసి ఉన్నాడని వారు గుర్తు చేస్తున్నారు.

ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ కారణంగా, క్షత్రియ సామాజిక వర్గం లో వైఎస్సార్సీపీపై , జగన్ పై, తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close