చీరలతో మహిళల మనసు గెలిచేలా కేటీఆర్ ప్లాన్..!

ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ సందడి కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ సారి చీరను సిద్ధం చేయించారు. పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు కూడా. గతంలో చీరల పంపిణీ సమయంలో ప్రభుత్వం కొన్ని విమర్శలు ఎదుర్కొంది. ఈ సారి ఆ విమర్శలకు తావు లేకుండా.. 287 విభిన్నమైన డిజైన్లలో బంగారు, వెండి, జరి అంచులతో తయారీ చేసిన పాలిస్టర్ ఫిలిమెంట్, నూలు చీరెలను సిద్ధం చేశారు. బతుకమ్మ పండుగ కోసం.. మహిళలకు ఈ కానుక ప్రభుత్వం అందిస్తోంది. ఈ చీరల కోసం రూ.317 కోట్లు వ్యయం చేశారు.

మొదటి సారి చీరల పంపిణీ జరిగినప్పుడు మహిళలు పెదవి విరిచారు. కొన్నిచోట్ల ఆందోళనలకు దిగారు. దీంతో తర్వాత ఏడాది నుంచి నాణ్యమైన చీరల ఉత్పత్తిని ప్రారంభించారు. ఈసారి చీరల తయారీకి 20 వేల మంది కార్మికులు 18 వేల మరమగ్గాలపై నిరంతరం పని చేశారు. కేటీఆర్ సొంత నియోజకవర్గ సిరిసిల్ల కార్మికులకే ఎక్కువ ప్రయోజనం లభించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కొత్త డిజైన్లతో తమ ప్రతిభను చూపించింది. కరోనా కారణంగా ఈసారి ఇంటింటికీ చీరలను పంపిణీ చేయబోతున్నారు.

ఇంటి బంధువుగా చీర పంపితే .. దాన్ని మహిళలు మనసారా తీసుకంటే.. కేటీఆర్‌ను కుటుంబసభ్యుడిగా మహిళలు చూస్తారనడంలో సందేహం లేదు. సెంటిమెంట్ ప్రకారం.. బతుకమ్మ పండుగకు తోబుట్టువుకు.. చీర పెడుతున్నారన్న భావన మహిళల్లో కల్పించడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందుకే.. మహిళలను నిరాశపర్చకుండా.. మంచి మంచి డిజైన్లతో.. క్వాలిటీగా చీరలను ఉత్పత్తి చేయించి పంపిణీ చేయిస్తున్నారు కేటీఆర్. ఇది ఆయనకు ఆత్మబంధువుల్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close