సహనానికీ హద్దు ఉంటుందని సంజయ్‌కు కేటీఆర్ హెచ్చరిక..!

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత ఒత్తిడిలో ఉన్న టీఆర్ఎస్ పూర్తిగా దూకుడు తగ్గించింది. అయితే.. ఈ దూకుడు విపక్షాలకు పెద్ద చాన్స్‌లాగా అయిపోయింది. దాంతో వారు గతం కన్నా ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టకపోతే.. తాము మరీ పలుచన అయిపోతామని టీఆర్ఎస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్‌పై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడటం ప్రారంభించారు. ఇప్పుడు నేరుగా కేటీఆర్ కూడా అదే పని ప్రారంభించారు.

ఒక్క బండి సంజయ్‌ను విమర్శిస్తే బాగుండదని అనుకున్నారేమో కానీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిపి విమర్శించడం ప్రారంభించారు. మా సహనానికి హద్దు ఉంటుందని …నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు లేవని వారికి చురకలంటించారు. కేటీఆర్ శైలి చూస్తూంటే… తాము మౌనంగా ఉన్నామని చెలరేగిపోతున్న విపక్ష పార్టీలకు చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. బండి సంజయ్ లాంటి నేతలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న పార్టీగా ఎవర్నీ లెక్క చేయడం లేదు.

కేసీఆర్ లాంగ్వేజే తనకు ఆదర్శమని చెబుతూ ఆయన చెలరేగిపోతున్నారు. ఆయన వ్యాఖ్యలు మరీ హద్దులు దాటినట్లుగా ఉంటూండటంతో టీఆర్ఎస్ నేతలు ప్రతి వ్యూహం అమలు చేస్తున్నారు. దాని ప్రకారమే ఎదురుదాడికి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్‌తో బీజేపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతారో లేకపోతే.. రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close