కార్మికుని మృతి,వెలగపూడి ఉద్రిక్తత

వెలగపూడిలో వేగంగా కొనసాగిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ఈ రోజు దేవేందర్‌ అనే కార్మికుడు ప్రమాదంలో దుర్మరణం పాలవడం విషాదం నింపింది. పైగా గతంలోనూ ఇలాగే మరో కార్మికుడు మరణించినట్టు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్మాణంలో అందునా అంతర్జాతీయ ప్రతిష్ట పొందిన సంస్థ ఆధ్వర్యంలో ఇలాటి ఘటనలు జరగడం మరింత తీవ్రమైన విషయం. దీనిపై లోతైన విచారణ జరిపి పనివత్తిడి, పని పరిస్థితులు మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఎల్‌ అండ్‌ టి రోజుకు పది గంటలు పనిచేయిస్తున్నట్టు 243 నుంచి 293 వరకూ మాత్రమే వేతనం ఇస్తున్నట్టు కార్మికులు చెబుతున్నారు.ే అది కూడా ఎప్పటికప్పుడు ఇవ్వకుండా పెండింగులో పెడుతున్నట్టు ఫిర్యాదులున్నాయి. కార్మికుడు మృతి చెందిన ఘటనపై ఆందోళన చేస్తున్నందుకు వామపక్ష నేతలను అరెస్టు చేయడం అక్కడ పోలీసులను ప్రయోగించడం మరింత ఉద్రిక్తత పెంచింది. ఇలాటి ఘటన జరిగినప్పుడు సంయమనం ప్రదర్శించి తక్షణ సహాయం కోసం ముందుకు రావాలి గాని వివాదం పెంచడం మంచిది కాదని స్థానికులు అంటున్నారు. రానురాను ఒత్తిడి పెరుగుతుంది గనక కార్మికుల భద్రతకు కట్టుదిట్టాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.రేపు ఇక్కడ ముందుముందు జరిగే వాణిజ్య నిర్మాణాలలో ప్రైవేటు కాంట్రాక్టర్లు కనీస నిబంధనలు పాటించాలన్నా ే ప్రభుత్వం వైపునుంచే పొరబాట్లు వుండకుండా చూసుకోవాలి.. లేదంటే సంఘర్షణలు పెరుగుతాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close