జ‌న‌తా గ్యారేజ్‌లో కామెడీ తక్కువా?

పాట‌లు విన్నాక‌, ట్రైల‌ర్ చూశాక జ‌న‌తా గ్యారేజ్‌పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. కొర‌టాల శివ ట్రాక్ రికార్డుకు ఇటీవ‌ల ఎన్టీఆర్ అందుకొన్న ఫామ్ తోడై… అభిమానులు మ‌రింత‌గా ఆశ‌లు పెంచేసుకొంటున్నారు. దాంతో పాటు.. విజువ‌ల్‌గా ఈ సినిమా ఎంత గ్రాండియ‌ర్‌గా ఉండ‌బోతోందో ట్రైల‌ర్‌లో క‌నిపిస్తూనే ఉంది. బాషా రేంజులో ఈ సినిమా ఆడేయ‌డం ఖాయం అని అప్పుడే ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు లెక్క‌లేసుకొంటున్నాయి. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. జ‌న‌తా గ్యారేజ్‌లో ఓ లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదే.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సినిమా అంతా సీరియ‌స్ మోడ్‌లో సాగిపోతోంద‌ని, రిలీఫ్‌కి అవ‌కాశ‌మే లేద‌న్న‌ది లాబ్ రిపోర్ట్‌. హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు కొర‌టాల శివ బాగా రాసుకొన్నాడ‌ని, అయితే.. కామెడీకి ఈ సినిమాలో స్కోప్ లేకుండా పోయింద‌ని తెలుస్తోంది.

కంటెంట్ బేస్డ్ సినిమాల‌తో వ‌చ్చే స‌మ‌స్య ఇదే. మిగిలిన సినిమాల్లా ఆడుతూ పాడుతూ స‌న్నివేశాల్ని రూపొందించుకొనే ఛాన్స్ ఉండ‌దు. మిర్చి, శ్రీ‌మంతుడు సినిమాలు కూడా ఇంతేగా. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వే సీన్ ఆ సినిమాలో ఒక్క‌టే ఉండ‌దు. కానీ.. సినిమాలు ఓ రేంజులో ఆడేశాయి. కొత్త రికార్డులు సృష్టించాయి. జ‌న‌తా గ్యారేజ్ కూడా అంతేన‌ని, ఎమోన్‌, హీరోయిజం, హృద‌యాన్ని తాకే డైలాగులు, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌.. వీటన్నింటితో ఈ సినిమా ప‌రుగు పెడుతుంద‌ని, కామెడీ లేక‌పోవ‌డం ఈసినిమాకి అస‌లు స‌మ‌స్యే కాద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ మైన‌స్‌ని ఎన్టీఆర్ ఎలా క‌వ‌ర్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close