పవన్ కల్యాణ్ పట్టించుకోవట్లేదని పరోక్షంగా చెప్పిన లక్ష్మినారాయణ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీ వ్యవహారాల్లో తనను పెద్దగా పట్టించుకోవడం లేదని.. సీబీఐ మాజీ జేడీ వీవీలక్ష్మినారాయణ పరోక్షంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా.. వీవీ లక్ష్మినారాయణ జనసేన పార్టీని వీడబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ కూడా పార్టీ వ్యవహారాల్లో లక్ష్మినారాయణను ఎక్కడా ఇన్వాల్వ్ చేయడం లేదు. ఏ కమిటీలోనూ ఆయనకు చోటివ్వలేదు. వీవీ లక్ష్మినారాయణ కూడా.. జనసేన కార్యక్రమాల్లో కనిపించడం లేదు. దాంతో.. ఈ ప్రచారం ఊపందుకుంది. దీనిపై.. జనసేన వర్గాలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ఈ ప్రచారం ఊపందుకోవడం… రేపోమాపో ఆయన బీజేపీలో చేరుతారంటూ.. డేట్లు కూడా వచ్చేస్తూండటంతో.. వీవీ లక్ష్మినారాయణ సోషల్ మీడియాలో స్పందించారు.

జనసేన పార్టీకి తన అవసరం ఉందని.. పవన్ కల్యాణ్ ఎంత వరకూ అనుకుంటారో.. అంత వరకూ.. తాను ఆయనతోనే ఉంటానని ప్రకటించారు. అవసరమైన వార్తలతో కాలం గడిపే బదులు… వరదబాధితులకు సాయం అందించారని.. ఈ ప్రచారం చేసే వారికి సూచించారు. వీవీ లక్ష్మినారాయణ ట్వీట్.. జనసేన అధినేత.. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా చేస్తానని.. ఆయన ఏమీ పని చెప్పకపోవడం వల్లే పార్టీకి దూరంగా ఉంటున్నానని.. చెప్పినట్లయింది. వీవీ లక్ష్మినారాయణ ట్వీట్‌ను జనసేన పార్టీ రీట్వీట్ చేసి.. ఆయన అభిప్రాయాల్ని.. తమ పార్టీ కార్యకర్తలకు కూడా చేరవేసింది. కానీ అందులో ఉన్న అర్థాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోయిననట్లుగా ఉన్నారు.

రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే వీవీ లక్ష్మినాాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన పదవీ రాజకీయాలు చేయాలనుకోలేదు. గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉండాలనుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్.. కొన్నాళ్లు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయినా వీవీ లక్ష్మినారాయణ మాత్రం ప్రజల్లో తిరిగారు. తర్వాత ఏమయిందో కానీ.. జనసేనలో ఆయన వాయిస్ వినబడటం తగ్గిపోయింది. పవన్ కల్యాణ్ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతోనే పార్టీ మార్పు ప్రచారం ప్రారంభమయింది. మరి ఇప్పుడైనా జేడీని పవన్ గుర్తిస్తారో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close