మోడీకి లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్!

కొండకు వెంట్రుక ముడేసి లాగితే కొండ రాదు వెంట్రుకే తెగిపోతుందని అందరికీ తెలుసు అయినా కూడా ఏదో ఆశ. అందుకే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఏదో ఒక సమస్యని ఎత్తి చూపించి “మేము రాజీనామాకు సిద్దం మీరు రాజీనామాకు సిద్దమేనా?” అంటూ అధికారపార్టీకి సవాళ్లు విసురుతుంటారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా నేతలు తెదేపాకి అటువంటి సవాలే విసిరారు. తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల సమస్యలపై ప్రతిపక్షాలు తెరాసకు అటువంటి సవాలే విసిరాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మోడీని డ్డీ కొనలేక చతికిలపడిపోయిన ఆర్.జే.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మోడీకి అటువంటి సవాలే విసిరారు. “ఒకవేళ బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినట్లయితే నరేంద్ర మోడి తన పదవికి రాజీనామా చేస్తారా?” అని సవాల్ విసిరారు. బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకపోవడంతోనే తన ఓటమిని అంగీకరించినట్లయిందని లాలూ ఎద్దేవా చేసారు.

అయితే అటువంటి సవాళ్ళను పట్టించుకొంటే మోడీయే కాదు ఎవరూ అధికారంలో స్థిరంగా ఉండలేరని లాలూ ప్రసాద్ యాదవ్ కి కూడా తెలుసు. ఇదివరకు ఒకసారి లాలూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు…కానీ అది ప్రతిపక్షాలు సవాలు చేసినందుకు కాదు… జైలుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు. అప్పుడు కూడా తన చేతిలో నుండి అధికారం చేజారిపోకుండా జాగ్రత్తపడుతూ తన భార్య రబ్రీదేవిని తన కుర్చీలో కూర్చోబెట్టి మరీ జైలుకి వెళ్ళారు. ఆ తరువాత అక్కడి నుండే ప్రభుత్వాన్ని నడిపించారు కూడా.

అవినీతి కేసులో నాలుగేళ్ళు జైలు శిక్షపడినందున ఎన్నికలలో పోటీ చేసేందుకు, అధికారం చేప్పట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్టీ తరపున వందమంది అభ్యర్ధులను బరిలో నిలబెట్టి వారి ద్వారా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఒకవేళ తను నిలబెట్టిన అభ్యర్ధులు ఎన్నికలలో ఓడిపోయినా ఆయనకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ బీజేపీ ఓడిపోతే మాత్రం నరేంద్ర మోడికి చాలా ఇబ్బందికరమే కానీ అంతమాత్రాన్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోరడం హాస్యాస్పదమే. బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధి పదవికి బీజేపీ దాని మిత్ర పక్షాలలో నలుగురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. వారిలో ఎవరి పేరు ప్రకటించినా మిగిలినవారు ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంటుంది కనుకనే బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిపేరును ముందుగా ప్రకటించలేదు. అంతే తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ చెపుతున్నట్లుగా ఓటమిని అంగీకరించి కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close