వారెవ్వా… లాలు వారసులొచ్చారు…

బీహార్లో లాలు రాజ్యం సాగిన రోజుల్లో పరిస్థితే వేరు. అంతా ఆయన కుటుంబం హవా. ఇప్పుడు మరోసారి చక్రం తిప్పడానికి నితీష్ తో కలిసి తెగ కష్టపడుతున్నారు. లాలు తన ఇద్దరు కొడుకులకూ ఈసారి పార్టీ టికెట్లు ఇచ్చారు. వారిద్దరూ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటడానికి సై అంటున్నారు. వారు ఓడిపోతే పరువుపోతుంది కాబట్టి యాదవుల అడ్డా వంటి సురక్షితమైన సీట్లు కేటాయించారు. అక్కడ యాదవ ఓటర్లే ఎక్కువట. తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీ చేస్తాడు. తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీపడతాడు.

బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమి తర్జన భర్జనల తర్వాత ఒకేసారి అన్ని సీట్లకూ అభ్యర్థులను ప్రకటించింది. కులాల వారీ లెక్కలు సమీకరణాలు చూసుకుని టికెట్లు పంచేశారు. 56 శాతం టికెట్లు బీసీలకు దక్కాయి. ముస్లింలకు 14 శాతం వాటా దక్కింది. లాలు పార్టీ యాదవులకు పెద్ద పీట వేసింది. 48 మంది యాదవులు ఆర్జేడీ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు.

అయితే మొత్తం మీద మహిళలకు 10 శాతం టికెట్లు మాత్రమే దక్కాయి. యువతకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా యువ ఓట్లపై కన్నేసింది. యువతకు ఎక్కువ సీట్లు కేటాయించినట్టు కమలనాథులు ప్రకటించారు. బీజేపీ యువ మంత్రం, మహా కూటమి కుల తంత్రంలో ఏది నెగ్గుతుందో మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close