మేడిన్ ఇండియా 5G జియోదే..!

రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది. వార్షిక వాటాదారుల సమావేశంలో ముఖేష్ అంబానీ… ఎప్పట్లాకే కీలకమైన ప్రకటనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 5G సర్వీసుల ప్రారంభంలో ఎవరు చరిత్ర సృష్టిస్తారో అని ఎదురు చూస్తున్న సమయంలో.. అమెరికా, చైనా కంపెనీలు.. మేమంటే..మేము అని పోటీ పడుతున్నాయి. ఈ సమయంలో.. తాము 5Gని అభివృద్ధి చేసేశామని.. స్పెక్ట్రమ్ రాగానే.. పరీక్షిస్తామని ముఖేష్ ప్రకటించడం.. టెక్నాలజీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

ఏజీఎంలో ముఖేష్ అంబానీ.. సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం.. ఇండియాకు వచ్చిన అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. ఇండియాలో.. రూ. 75వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. అందులో రూ. దాదాపుగా 34వేల కోట్లను జియో ఫ్లాట్‌ఫామ్స్‌లోనే పెట్టబోతున్నట్లుగా ముఖేష్ ప్రకటించారు. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో 7.7 శాతం వాటాను గూగుల్‌కు రూ. 33,737 కోట్లకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ కూడా పెట్టుబడి పెట్టింది. రూ.43,574 కోట్లతో 9.99శాతం వాటా కొనుగోలు చేసింది. అంటే.. రెండు టెక్ దిగ్గదాలు.. జియో ఫ్లాట్‌ఫామ్‌లో వాటా కలిగి ఉన్నట్లయింది. ప్రస్తుతం జియో ఈక్విటీ వాల్యూ 4.91లక్షల కోట్లు కాగా..ఎంటర్ ప్రైజ్ వాల్యూ 5.16 లక్షల కోట్లు.

గూగుల్‌తో కలిసి 5G అనేబుల్డ్ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకే అందిస్తామని.. ముఖేష్ ప్రకటించారు. క్రితం సారి జరిగిన ఏజీఎంలో… రిలయన్స్ పెట్రో వ్యాపారంలో వాటాను.. సౌదీ ఆరామ్‌కో సంస్థకు అమ్మేసి.. రిలయన్స్‌ను రుణరహితంగా చేయనున్నట్లుగా ప్రకటించారు. ఆయితే.. ఆ డీల్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో.. జియో ఫ్లాట్‌ఫామ్‌లో వాటాలు అమ్మేసి.. ఆ లక్ష్యం సాధించారు. అంతకు మించి ఇంకా గూగుల్ డీల్‌తో.. ఎక్కువ నిధులే సమీకరించారు. ఇప్పుడు ఆరామ్‌కోతో డీల్ ఉంటుందో లేదో.. ముఖేష్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. 5G సర్వీసులు ప్రారంభించబోతున్నామని ప్రకటించి… సంచలనం మాత్రం సృష్టించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close