త్రివిక్రమ్ పై మధుబాబు మనసులో మాట

మధుబాబు.. తెలుగు పాఠకులకు పరిచయ వాఖ్యలు అవసరం లేని పేరు. షాడో మధుబాబుగా పాపులర్. ఆయన రాసిన షాడో డిటెక్టివ్ నవలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడున్న చాలా మంది దర్శక రచయితలకు మధుబాబు అంటే ఆరాధన. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వున్నారు. షాడో నవల చదివి ఎవరీ మధుబాబు? అంటూ పుస్తకం పై వున్న ఆయన అడ్రస్ ను వెతుకుంటూ హనుమాన్ జంక్షన్ లో పడిగాపులు కాసిన అభిమాని త్రివిక్రమ్. అయితే ఇంత పాపులారిటీ వున్నప్పటికీ ఏనాడూ ఆయన పబ్లిక్ లో కనిపించింది లేదు.

అలాంటి మధుబాబు తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. తన జీవితం, రచనలకు సంబధించిన చాలా విషయాలు గురించి పంచుకున్నారు. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. పనిలో పనిగా త్రివిక్రమ్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో రానున్న సినిమా.. మధుబాబు నవల ఆధారంగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మధుబాబు స్పదించారు. ” ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో తెలియదండీ?!. అవాస్తవం. మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. త్రివిక్రమ్ నాకు తెసులు ఎప్పటినుంచో. ఆయనకు కధ చెప్పి ఒప్పించడం అంత తేలిక కాదు. పైగా ఎన్టీఆర్ సినిమా అంటున్నారు. అలాంటి హీరోకి కధ అంటే మాటలు కాదు. చాలా కసరత్తులు చేయాలి. ఎదో నవల అంటే సరిపోదు కదా. త్రివిక్రమ్ గురించి నాకు బాగాతెలుసు. ఆయనకు ఆయన కధ తప్పితే ఇంకేది పట్టుదు( నవ్వుతూ). మాకు మంచి పరిచయం వుంది. ఒకసారి నన్ను ఇంటర్వ్యూ కూడా చేశాడు. కుదిరినప్పుడు మాట్లాడుతుంటాం. అంతే తప్పితే ఇంకేమీలేదు” అని చాలా మృదువుగా ఈ అంశాన్ని కొట్టేపారేశారు మధుబాబు.

మొత్తంమ్మీద స్వయంగా మధుబాబే స్పదించడంతో ఈ గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పడినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close