ప్రజాకూటమి లెక్క తేలింది..! అందరూ హ్యాపీసే..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్ అయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక నిమిత్తం ఏర్పాటైన భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ పార్టీ సీనియర్‌ నాయకులతో ఆదివారం ఉదయం సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ ద్వారా నియోజక వర్గాల వారీగా బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పంపించారు. ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ ముకుల్‌ వాస్నిక్‌కు ఆమోదముద్ర వేసిన తరువాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. కూటమిలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లు, స్థానాలు కూడా ఖరారయ్యాయి. 119 సీట్లలో కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయనుంది. తెలుగుదేశం 15 స్థానాల్లో, టీజేఎస్‌ 10 చోట్ల, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగుతాయి. ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా, ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటించే అవకాశం ఉంది.

నాలుగు పార్టీల రాష్ట్ర శాఖల బాధ్యుల సమక్షంలో అభ్యర్థులను ప్రకటిస్తారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వాలు స్వయంగా పరిశీలిస్తూ, వివిధ సర్వేల ఆధారంగా ప్రతి సీటునూ ఆచితూచి ఎంపిక చేశారు. లోక్‌సభ సీట్లు, సామాజిక వర్గాలు ప్రాతిపదికగా అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరిగింది. కూటమికి కీలకంగా మారిన తెలుగుదేశం.. 2014లో తాను గెలిచిన స్థానాల్లోనే ఇప్పుడూ పోటీ చేయటానికి ఆసక్తి చూపింది. దీంతో భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేకపోతే, ఆయా సీట్లు టీడీపీకే దక్కనున్నాయి. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి టీడీపీకి దక్కబోతున్నట్టు తెలిసింది. ఈ 8 సీట్లకూ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రమణ కోరుట్ల నుంచి పోటీ చేయడం ఖాయమైంది.

మిగతావాటిలో కోదాడ, మహబూబ్‌నగర్‌, దేవరకద్రల్ని టీడీపీ కోరుతోంది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేయనున్నందున, దానికి బదులు సికింద్రాబాద్‌ ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. వీలైతే కుత్బుల్లాపూర్‌, మహేశ్వరం, మక్తల్‌ సీట్లను తీసుకోవటానికి టీడీపీ ఆసక్తి చూపుతోంది. నామా నాగేశ్వరరావు పోటీ చేయటానికి సిద్ధపడితే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close