తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటకు వస్తాయా..?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మహాకూటమి నేతలు నిన్న ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిని నివేదిక కోరారు. ఎవరివైనా ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతోందా? చేస్తే ఎవరెవరివి ట్యాప్‌ చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని కోరారు. వాహనాల తనిఖీలో భాగంగా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా వేధిస్తూ, కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని, సెల్‌ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని మహాకూటమి నేతలు నిన్న ఆరోపించారు.

కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్‌.రమణ, చాడ వెంకట్‌రెడ్డి, దిలీప్‌కుమార్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ట్యాపింగ్ చేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు సమర్పించారు.నిజానికి ఫోన్ ట్యాపింగ్ అంశం.. తెలంగాణలో చాలా రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. ఒక్క ప్రతిపక్ష నేతలవే కాదు.. టీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి వాట్సాప్ కాల్స్ ను కూడా ట్రాక్ చేయడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుందని మీడియాలో కూడా ప్రచారం జరిగింది.

కొన్ని రాజకీయ పార్టీల నేతలు.. ఫోన్లలో మాట్లాడుకున్న మాటలు.. టీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసిపోవడం.. దానికి తగ్గట్లుగా… అధికార పార్టీ కొన్ని చర్యలు తీసుకోవడంతో.. వారిలో అనుమానం బలపడింది. ఎల్. రమణ, కోదండరాం సహా పలువురు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు గుర్తించారు. అయితే .. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశం లేదు. అంతా అనధికారికంగానే ట్యాపింగ్ చేస్తూంటారు. కాబట్టి.. ఎలాంటి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదన్న సమాచారం… ఈసీకి పోలీస్ బాస్ ఇచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close