`వెలి’పై చట్టం; ముందంజలో మహారాష్ట్ర

ఒక పక్క ఉగ్రవాద దాడులకు సంబంధించిన వార్తలు, మరో పక్కన దేశ రాజకీయాల్లోని సంచలన వార్తల మధ్య సమాజానికి పనికొచ్చే మఖ్యమైన వార్తను చాలామంది గమనించి ఉండకపోవచ్చు. అది సంఘ బహిష్కరణకు సంబంధించిన వార్త. టీవీలు పెద్దగా పట్టించుకోని వార్త. కానీ దేశ సమాజాభివృద్ధికి చాలా అవసరమైన వార్త.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67ఏళ్లు అయినప్పటికీ, చాలా ఊర్లలో సంఘ బహిష్కరణ ఓ కట్టుబాటుగా సాగిపోతోంది. కులకట్టుబాట్ల పేరిట అత్యంత దారుణాలు జరిగిపోతున్నాయి. ఊరి కట్టుబాట్లు, కులపంచాయతీలు గ్రామస్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. హింసాత్మక సంఘటనలు సరేసరి. ఈ విషసంస్కృతిపై ఏనాడో చట్టపరంగా పంజావిసరాల్సింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలోని మిగతారాష్ట్రాలకంటే ముందంజవేసింది. తన ప్రభుత్వ వెబ్ సైట్ (www.maharashtra.gov.in)లో ‘Maharashtra Prohibition of Social Boycott Act, 2015’ బిల్లు ముసాయిదా ప్రతిని ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచింది. సంఘ బహిష్కరణను నిషేధించాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ బిల్లుని త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లుకు చట్టబద్ధత వస్తుంది.

ఈ చట్టం అమల్లోకి వస్తే….

1. దోషులుగా నిర్థారణ అయితే, ఐదు లక్షల రూపాయలవరకు జరిమానా, ఏడేళ్ళ జైలుశిక్ష గానీ లేదా రెండూ కలిపిగానీ విధించేందుకు వీలుచిక్కుతుంది.

2. ఛార్జిషీట్ సిద్ధమయ్యాక ఆరునెలల్లో కేసు విచారణ పూర్తిచేయాలి.

3. `కుల పంచాయితీ’ -అన్న మాటకు ఈ ముసాయిదా ప్రతి వివరణ ఇచ్చింది. ఏ కులానికి చెందిన వారైనా కమిటీగా (కూటమిగా) ఏర్పడి (ఆ కమిటీ రిజిస్టర్డ్ అయినా కాకపోయినప్పటికీ) కుల పంచాయితీ పేరిట కట్టుబాట్ల ఆధారంగా విచారణ చేపట్టడం, మౌఖికంగాగానీ, లేదా లిఖితపూర్వకంగా గానీ నిర్ణయాలు తీసుకోవడం, తీర్పులు చెప్పడం .

4. ఈ చట్టం క్రింద నమోదయ్యే కేసుల్లో నిందితులకు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది.

5. మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ లేదా జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) ఈ కేసు విచారణ చేపట్టవచ్చు.

6. సంఘబహిష్కరణ నిషేధిత కార్యనిర్వాహకాధికారిని నియమించే సౌకర్యం ఈ చట్టం కల్పిస్తుంది. ఈ అధికారి ఇటు పోలీసులకు, అటు మెజిస్ట్రేట్ కి అవసరమైనప్పుడు సహకారం అందిస్తుంటారు.

మహారాష్ట్రలో ఈమధ్య కులకట్టుబాటు క్రింద వెలివేసిన సంఘటనలు ఎక్కవయ్యాయి. ఒక్కోసారి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇది తప్పన్నవారిపై దాడులకు పాల్పడి చంపేసిన సంఘటనలు కూడా జరిగాయి. దీంతో చాలామంది సామాజిక కార్యకర్తలు వెలిని నిషేధించాలంటూ అనేకసార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా చట్టాన్ని తీసుకురావడంలోనే కాదు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడంలో కూడా మిగతా రాష్ట్రాలకంటే ముందంజ వేయడం గమనార్హం.

బిల్లు లక్ష్యం మంచిది కావడంతో పలువర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే, బెయిలబుల్ అన్నది నాన్ బెయిలబుల్ గా మార్చాలని చాలామంది సూచిస్తున్నారు. మహారాష్ట్రలో మాదిరిగానే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ తరహా చట్టాలు రావాలని సామాజిక కార్యకర్తలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప సవాల్ – అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ !

కడప ఎంపీ బరి ఈ సారి ప్రత్యేకంగా మారనుంది. అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున...

ఐదేళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికే జనాల్లోకి జగన్ !

పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన...

తుండు రివ్యూ: కాపీ కొట్ట‌డం ఎలా?

Thundu movie review ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వ‌చ్చాక‌... ఆ భాష‌లో సినిమాల్ని స‌బ్ టైటిల్స్ తో చూసే బాధ త‌ప్పాక‌, తెలుగు డ‌బ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మ‌రింత...

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close