రాజధాని మంగళగిరికి మార్చాలంటున్న ఆర్కే..!

ఇప్పుడు రాజధాని ఎక్కుడుంది..? అనే అనుమానం అక్కర్లేదు. రాజధాని మంగళగిరిలో లేదు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న వెలగపూడి గ్రామంలో ఉంది. అందుకే… మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి … రాజధానిని మంగళగిరికి మార్చాలంటున్నారు. మంగళగిరిలో పదివేల ఎకరాల అటవీ, ప్రభుత్వ భూములన్నాయని.. కావాల్సినన్ని.. భవనాలు అందుబాటులో ఉన్నాయని… కార్యాలయాలన్నింటినీ రాజధానికి మారిస్తే.. ఇబ్బందులు ఏమీ ఉండవని ఆర్కే.. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వానికి… కార్యాలయాలను.. మంగళగిరికి మార్చే ఆలోచన ఉందని.. కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై.. ప్రభుత్వ పెద్దలు స్పందించకపోయినా… దానికి తగ్గట్లుగా.. ఒక్కొక్కరితో లేఖలు.. డిమాండ్లు మాత్రం వినిపిస్తున్నారు. అంటే.. ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్లుగానే భావించాలి.

రామకృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా… లేఖలు రాయడం.. వాటిని మీడియాకు విడుదల చేయడం అనేది అసాధ్యం. సాధారణంగా ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టినా… లేఖ రాసినా.. సొంతంగా… చేసే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో.. సాక్షి ఆఫీసు నుంచే ఈ తతంగం నడుస్తుంది. ఏం మాట్లాడాలన్నది ముందుగానే నోట్ రూపంలో ఇస్తారు. ఇక లేఖలయితే.. సాక్షి ఆఫీసులోనో.. వైసీపీ ఆఫీసులోనే రెడీ అవుతాయి. ఆర్కే లేఖ కూడా.. అలా సిద్ధమయిందని… ఆ తర్వాతే మీడియాకు విడుదల చేశారని భావిస్తున్నారు.

రైతు భరోసాను మూడు ముక్కలు చేయడానికి … రైతులే కారణమని.. వారే కోరుకున్నారని ప్రభుత్వం ప్రకటించుకుంది. అదే తరహాలో.. వెలగపూడి నుంచి.. మంగళగిరికి ప్రభుత్వ కార్యాలయాలన్నీ మార్చాలన్న డిమాండ్లను.. తెరమీదకు తీసుకు వచ్చి.. ప్రజలే కోరుతున్నారంటూ.. మార్చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. త్వరలో కొంత మంది సీనియర్ అధికారులు, కొత్తగా నియమితులయిన సలహాదారులు కూడా.. ఈ మేరకు జగన్ కు ఓ వినతి పత్రం సమర్పిస్తారని.. ఆ తర్వాత కార్యాచరణ ప్రారంభమవుతుందని అంటున్నారు. మొత్తానికి మంగళగిరి నుంచి వెలగపూడికి ఓ పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close