ఇక మంత్రాలయ భూముల వేలం వివాదం..!

ఇతర రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి ఆస్తులను .. కాపాడుకోలేక అమ్మాలని టీటీడీ ప్రయత్నించింది. కానీ తీవ్రమైన వివాదం రేగడంతో ఆగిపోయింది. ఇప్పుడు అలాంటి వివాదం.. కర్నూలు జిల్లాలోని రాఘవేంద్రస్వామి మఠం భూముల అమ్మకంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రసిద్ధి చెందిన రాఘవేంద్ర స్వామి మఠానికి తెలంగాణలోని గద్వాల జిల్లాలో 208 ఎకరాల భూములున్నాయి. వాటిని కాపాడుకోలేపోతున్నామని చెబుతూ.. అమ్మాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. దానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో వేలానికి ముహుర్తం సిద్ధం చేశారు.

మంత్రాలయం మఠానికి మొత్తంగా 5,192 ఎకరాల భూములు ఉన్నాయి. తెలంగాణలో 1,873 ఎకరాలు ఉంన్నాయి. చాలా మంది కౌలు చెల్లించడం లేదని.. కొంత మంది ఆక్రమించి పట్టాలు పుట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఇబ్బందులన్నీ ఎందుకని భూమల్ని అమ్మాలని మఠం నిర్ణయించింది. అలాగే.. కర్నూలు జిల్లా కౌతాళంలోనూ 251 ఎకరాల భూమిని అమ్మాలని నిర్ణయించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పవిత్రమైన ఆలయం భూములు అమ్మితే ఊరుకునేది లేదని ఇప్పటికీ బీజేపీ నేతలు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ మేరకు ఏపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

నిజానికి మంత్రాలయం భూముల అమ్మకం ప్రతిపాదన ఇప్పటిది కాదు. మూడేళ్ల కిందటిదే. అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు కానీ.. అనుమతి లభించలేదు. ఇప్పుడు అనుమతి లభించలేదు. కౌలు రావడం లేదని.. అమ్మితే కోట్లు వస్తాయని.. వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆలయానికి ఆదాయం వస్తుందని చెబుతున్నారు. అయితే ఆలయ భూములంటే.. భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నాయి. అంతకు మించి ఇప్పుడు రాజకీయంతో కలిసిపోతున్నాయి. టీడీపీ హయాంలో.. అసలు డాక్యుమెంట్లే లేని.. పూర్తిగా ఆక్రమణకు గురైన సదావర్తి భూముల్ని వేలం వేస్తే అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి ఆ వేలాన్ని ఎటూ కాకుండా ఆపేశారు. అదే దారిలో ఇప్పటి ప్రతిపక్షాలు నడవవన్న గ్యారంటీ లేదు. తిరుమల విషయంలో అదే జరిగింది. మంత్రాలయం విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close