కొత్త కాంబో : మారుతి – సాయిధ‌ర‌మ్‌

వ‌రుస విజ‌యాల‌తో సాయిధ‌ర‌మ్ తేజ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. సాయితో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారిప్పుడు. ద‌ర్శ‌కులూ క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. తాజాగా మారుతి కూడా సాయిధ‌ర‌మ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడ‌ని టాక్‌. దానికి సాయి కూడా ఓకే అనేశాడ‌ట‌. ప్ర‌స్తుతం మారుతి బాబు బంగారంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. ఈసినిమా పూర్త‌యిన వెంట‌నే సాయిధ‌ర‌మ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. సాయిధ‌ర‌మ్ కాంపౌండ్ వ‌ర్గాలు కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించాయి. ”సాయికీ, మారుతికీ మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్లు త‌ర‌చూ క‌లుస్తుంటారు. మాట‌ల ప్ర‌స్తావ‌న‌లో సాయికి ఓ లైన్ కూడా వినిపించారు మారుతి. త్వ‌ర‌లోనే వీరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఉంటుంది” అంటున్నారు వాళ్లు.

బాబు బంగారంల‌పై మంచి టాక్ న‌డుస్తోంది. ఈ సినిమా మినిమం యావ‌రేజ్ అయినా.. మారుతి టాప్ లీగ్‌లోకి చేరిపోవ‌డం ఖాయం. ఒక్క‌సారి టాప్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోతే.. పెద్ద‌హీరోల‌పైనే దృష్టి ప‌డుతుంది. అలాంట‌ప్పుడు సాయిధ‌ర‌మ్‌తో సినిమా చేసే ఛాన్సుండ‌దు. కానీ మారుతి మాత్రం క‌థ‌కీ, రిలేష‌న్‌కీ ప్రాధాన్యం ఇచ్చే వ్య‌క్తీ అని.. ఈ కాంబినేష‌న్‌లో సినిమా రావ‌డం ఖాయ‌మ‌ని మారుతి స‌న్నిహిత వ‌ర్గాలు సైతం చెబుతున్నాయి. సో.. కాంబో సెట్ట‌యిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close