జనసేనానికి తోడుగా మాయావతి..! ఇక ప్రచార హోరు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రచారంలో జోరు పెంచారు. మిత్రపక్షం బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారు. ఆమెతో రెండు బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్ధుల గెలుపుకోసం బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారం చేయనున్నారు. విశాఖ చేరుకున్న ఆమెకు.. పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. హోటల్ వద్దకు వచ్చిన ఆమె కారు డోర్ ను స్వయంగా తీసేందుకు ప్రయత్నించారు. ఆ పని భద్రతా సిబ్బంది చేయడంతో.. ఆమె దిగగానే మాయావతి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

మాయావతి రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం విశాఖపట్టణంలో పవన్‌తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్తారు. గతంలో ఓ సారి మాయావతితో భేటీ కోసం.. లక్నో వెళ్లినా సాధ్యం కాలేదు. కానీ.. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత… ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించిన తర్వాతి రోజే… లక్నోకు వెళ్లిపోయారు. మాయావతిని కలిసి పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు.

ఇప్పుడు ఆమెను ప్రచారానికి కూడా ఏపీకి వచ్చేలా చేయగలిగారు. జనసేనకు సంప్రదాయంగా ఉంటానుకున్న వర్గాల మద్దతుతో పాటు.. మాయావతి ద్వారా దళిత వర్గాల మద్దతు కూడగట్టుకోవచ్చని.. పవన్ ఆశిస్తున్నారు. అయితే ఏపీలో బీఎస్పీకి ఉనికి లేదు. కేవలం మాయావతిని చూసి జనసేన కూటమికి దళితులు ఓట్లు వేస్తారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close