విషాదంగా ముగిసిన బోరులో పడిన బాలుడి ఉదంతం

హైదరాబాద్: మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో నిన్న ఉదయం బోరుబావిలో పడిన బాలుడు చనిపోయాడు. బాలుడిని 24 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఇవాళ ఉదయం బయటకు తీశారు. అయితే అతను చనిపోయి ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు.

నిన్న ఉదయం ఆ బాలుడు రాకేష్ పడిపోగానే ఆ వార్త అన్ని టీవీ ఛానల్స్‌లో ప్రముఖంగా ప్రసారం చేయబడటంతో అతనిని బయటకు తీయటానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థల సిబ్బంది బాలుడిని బయటకు తీయటానికి శతవిధాలా ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే బాబూ మోహన్ కూడా అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. జేసీబీలు, భారీ యంత్రాలను సైతం ఉపయోగించారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపించారు. కానీ ఇంత చేసినా చివరకు విషాదేమే మిగిలింది. రాత్రంతో సహాయక కార్యక్రమాలు జరిగిన తర్వాత ఉదయానికి 40 అడుగుల కింద బాలుడు కనపడ్డాడు గానీ, ప్రాణాలు లేవు. సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా నుదిటికి గాయమై ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నోసార్లు జరిగినా ఇవి పునరావృతమవుతూనే ఉన్నాయి. బోర్లు వేసేవారు ఆ గొయ్యిపై రాయిపెట్టటం, ముళ్ళకంచె పెట్టటం వంటి చర్యలు తీసుకోకపోవటంతో ఇవి చోటుచేసుకుంటున్నాయి. తాజా సంఘటనలోమాత్రం, బోరు వేసిన తర్వాత తాము ఆ గోతిపై రాయి పెట్టేలోపే ఈ దుర్ఘటన జరిగిందని పొలం యజమాని చెబుతున్నారు. ఆ బోరులో నీరు పడకపోవటంతో రెండో చోట బోరు వేద్దామని యజమాని ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close