జనసేన కోసం రంగంలోకి “మెగా ఫ్యాన్స్”

విజ‌య‌వాడ‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు స‌మావేశం అయ్యారు. ముర‌ళీ ఫార్చున్ హోట‌ల్ లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ప‌రిమిత సంఖ్య‌లో మెగా ఫ్యాన్స్‌ను ఆహ్వానించారు. అందరూ కలిసి జనసేన పార్టీకి ఎలా మద్దతుగా నిలవాలన్న అంశంపై చర్చించారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు క‌లిసి సంయుక్తంగా ప‌నిచేసి, జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డం అలా అని ప్రణాళికలు వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు అధ్యక్షతన నిర్వహించారు.
ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించామని.. జనసేన ను జనంలోకి తీసుకెళ్లేలా మా వంతు కృషి చేస్తామని ప్రకటించారు.

2024లో పవన్ కళ్యాణ్ ను సిఎం ని చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ఇది తొలి సమావేశం అని.. మరికొన్ని సమావేశాలు అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తామని స్వామి నాయుడు ప్రకటించారు. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని ప్రకటించారు. మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలు గా పని చేస్తారని ప్రకటించారు. పొత్తుల అంశంపై తమకు సంబంధం లేదని.. గతంలో ప్రజారాజ్యం పై అనేక కుట్రలు చేశారని.. కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశామన్నారు.

ఇప్పుడు జనసేన పై అసత్యాలు, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.గరి అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్‌కు విడివిడిగా అభిమానులు లేకపోయినా ముగ్గురి అభిమానుల పేరుతో సభను నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో రాజకీయ వేడి పెరుగుతున్నందున ఫ్యాన్స్ సేవలను గరిష్టంగా వాడుకునే ఉద్దేశంతో అభిమాన సంఘాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతను స్వామినాయుడుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close