బీహార్ ఎన్నికల బరిలో మజ్లీస్ కూడా…

ఇంతవరకు కేవలం తెలంగాణాకే పరిమితమయిన మజ్లీస్ పార్టీ, గతేడాది జరిగిన ఎన్నికలలో మహారాష్ట్రాలో రెండు సీట్లు గెలుచుకొంది.క్రమంగా దేశంలో అన్ని రాష్ట్రాలలోను తమ పార్టీని విస్తరించాలని ప్రయత్నిస్తున్న మజ్లీస్ పార్టీ త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు మరొక మంచి అవకాశం కల్పించాయి. బీహార్ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసద్దుద్దీన్ ఒవైసీ నేడు ప్రకటించారు. తమ పార్టీ మొత్తం 40 స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు. ముస్లిములు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో మజ్లీస్ పార్టీ పోటీ చేయబోతున్నట్లు అసద్దుదీన్ సూచించారు. తమ పార్టీ గెలిస్తే సీమాంచల్ అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇంతవరకు బీహార్ లో ముస్లిం ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లేదా కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తూ వచ్చారు. కానీ మజ్లీస్ పార్టీ అడుగుపెడితే మొత్తం ముస్లిం ప్రజలందరూ దానికే మరిలిపోయే అవకాశం ఉంటుంది కనుక మజ్లిస్ పార్టీ ప్రవేశంతో ఆ మూడు పార్టీల విజయావకాశాలపై విపరీత ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే తనను తాను ‘ములాయం ఖాన్’ గా అభివర్ణించుకొంటూ ముస్లిం ప్రజల ఓట్లు సంపాదించుకొంటున్న ములాయం సింగ్ కూడా మజ్లీస్ పార్టీ ప్రవేశంతో తీవ్రంగా నష్టపోవచ్చును. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ, జనతా పరివార్, వామపక్ష కూటమి బరిలో ఉన్నాయి. ఇప్పుడు వాటికి మజ్లీస్ పార్టీ కూడా తోడయింది. ఇవి కాక అనేకమంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా బరిలో ఉండటం ఖాయం కనుక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ జనతా పరివార్ లో మళ్ళీ చీలిక వచ్చినట్లయితే ఓట్లు చీలిపోయే అవకాశం ఇంకా ఎక్కువవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close