ఆయనంతే..! చేసింది గాంధీ విగ్రహావిష్కరణ.. ఇచ్చింది చంద్రబాబును పాతేస్తామనే స్పీచ్..!

జగన్‌ను ఏమైనా అంటే చంపేస్తాం.. పాతేస్తాం.. పూడుస్తాం..! ఇవీ మంత్రి అనిల్… ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన హెచ్చరికలు. ఆయన స్వభావమే అలాంటిది కాబట్టి… అందులో వింతేముందని.. అనుకోవచ్చు కానీ.. ఈ హింసా వాది… అలాంటి మాటలు అన్న సందర్భమే విచిత్రం. ఆయన కర్నూలుజిల్లా నంద్యాలో .. అహింసా వాదంతో స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. ఒక చెంపపై కొడితే.. మరో చెంప చూపించాలన్న విధానాన్ని పాటించిన మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అదే ఆయన ఆశయాలకు తానిస్తున్న గొప్ప గౌరవం అన్నట్లుగా మాట్లాడారు. తీరా విగ్రహావిష్కరణ చేసిన తర్వాత..తాను గాంధీ మహాత్ముడి చెంత ఉన్నానని.. అలాంటి మాటలు మాట్లాడకూడదని నియమం పెట్టుకోలేదు. తాను జగన్‌ భక్తుడినని.. ఆయన్ను ఏమైనా అంటే ఊరుకోనన్నారు. జగన్‌ మూడో నేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతారంటూ హెచ్చరించారు. మంత్రి పదవి ఉంటుంది..ఊడుతుంది. దాని గురించి ఎప్పుడూ మేం భయపడం. కానీ జగన్‌ను ఏమైనా అంటే మాత్రం పాతేస్తామని హెచ్చరించారు.

రాజకీయ విమర్శలంటే.. వైసీపీ నేతలకు.. తిట్లు, బెదిరింపులే తప్ప.. విధానమైన అంశాలపై ఎప్పుడూ మాట్లాడరు. దానికి తగ్గట్లుగానే.. ఉన్నా… అసలు సమయం సందర్భం చూసుకోకుండా.. అనిల్ ఆవేశం ఎందుకో చాలా మందికి అర్థం కావడం లేదు. చంద్రబాబును ఎక్కడైనా తిట్టుకోవచ్చు… కానీ.. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించినందున.. కనీసం మహాత్ముడికైనా గౌరవం ఇవ్వాల్సింది కదా.. అనే చర్చ సామాన్యుల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close