జగన్ “స్టే” ఆశల్ని వమ్ము చేసిన తప్పుల పిటిషన్..!

మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.. ఆ పిటిషన్ వెనక్కి వచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన ధర్మాసనం పేర్లు తప్పుగా రాశారు. అలాగే..ఇచ్చిన ఉత్తర్వులేమిటో.. పిటిషన్‌కు జత చేయలేదు. దీంతో తప్పులు సరిదిద్దుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సోమవారమే విచారణకు వస్తుందని ఆశపడిన ఏపీ సర్కార్‌కు సోమవారం విచారణకు రాలేదు. దాంతో అర్జంట్‌గా విచారించాలంటూ.. మరో అప్లికేషన్ పెట్టారు. ఈ తరుణంలో పిటిషన్‌లో తప్పులు బయటపడ్డాయి.

ఇప్పుడు ఏపీ సర్కార్ పని రెంటికి చెడ్డ రేవడి అయినట్లయింది. ఓ వైపు హైకోర్టులో 14వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులోనూ మళ్లీ పిటిషన్ వేయాల్సి ఉంది. రెండు కోర్టుల్లోనూ సమాంతరంగా విచారణ జరిగే అవకాశం లేదు. ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ పై విచారణ తేలిన తరవాత హైకోర్టులో విచారణ జరుగుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లలో తప్పుల వల్ల.. పదహారో తేదీకి క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు. దీంతో… శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి అడ్డంకులను పట్టించుకునేవారు కాదని.. ఆయన అనుకుంటే శంకుస్థాపన చేసేస్తారని అంటున్నారు. ప్రభుత్వ ఆలోచన ఏమిటో.. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నియమించిన న్యాయనిపుణులకు పిటిషన్లు వేయడం కూడా రావడంలేదు. గతంలో నిమ్మగడ్డ విషయంలో తప్పుల తడకలతో పిటిషన్లు వేయడంతో ఓ సారి వెనక్కి వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close