మోడీ ప్రచార ఖర్చు బీజేపీ భరించిందా..? ప్రజలు నిలదీయవద్దా..?

నాలుగేళ్లలో మోడీ ప్రచార వ్యయం : రూ. 5,245.73 కోట్లు
విదేశీ పర్యటనలకు మోడీ చేసిన ఖర్చు : రూ.2014 కోట్లు

ఇది అధికారికంగా పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపిన సమాచారం. ఇక రెండు నెలల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దేశం మొత్తం తిరుగుతున్నారు. బహిరంగసభల్లో పదే పదే ప్రసంగిస్తున్నారు. ఒక్క రోజే మూడు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ ఖర్చంతా ఎవరిది..? అచ్చంగా… ప్రజల డబ్బు. మోడీ గుంటూరు సభలో.. బహిరంగసభకు అయిన ఖర్చు గురించి… కన్నా లక్ష్మినారాయణను అడిగినట్లు.. ఓ స్కిట్ ప్రదర్శించారు. బీజేపీ కార్యకర్తల ఖర్చుతోనే అదంతా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ.. బీజేపీ సభ వెనుక ఓ చిన్న టెంట్ వేసి.. అందులో.. కృష్ణపట్నం, విశాఖల్లో.. రెండు పెట్రోలియం ట్యాంకుల నిర్మాణం కోసం.. శంకుస్థాపన లాంటి కార్యక్రమం ఎందుకు చేశారు..?. ఇక్కడే ఉంది లాజిక్ అంతా..!

అధికారిక కార్యక్రమం పేరుతో… ప్రధాని మోడీ గుంటూరుకు వచ్చారు. ఆయన ఖర్చులన్నీ ప్రభుత్వ ఖాతాలో వేశారు. గుంటూరులో.. ఓ టెంట్ మాత్రం.. బీజేపీ ఖర్చుతో వేశారు. ఇది ఒక్క గుంటూరులోనే కాదు.. గత రెండు నెలలుగా.. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ.. బీజేపీ తిరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. కేంద్రం చేపట్టిన.. లేదా చేపట్టబోయే ప్రాజెక్ట్ పేరుతో.. అధికారిక పర్యటనకు.. ఆయా రాష్ట్రాలకు వెళ్తారు. అది ఐదారు నిమిషాల్లో ముగించేస్తారు. మిగతా సమయం అంతా… ఎన్నికల ప్రచారానికి కేటాయిస్తాయి. అంటే.. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సభలకు.. టెంట్లు మాత్రమే బీజేపీ ఖర్చు. మిగతా వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖాతా నుంచే వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు మోడీ ఎన్నికల ప్రచారసభలు ప్రారంభించడానికి కారణం.. ప్రజాసొమ్మును ఇలా.. పార్టీ ప్రచారం కోసం వాడుకోవడానికే. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ప్రధాని హోదాలో ఆయనకు చాలా పరిమిమైన సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగతావన్నీ.. బీజేపీ ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు అయితే.. ఆయన ఖర్చంతా.. ప్రభుత్వం ఖాతాలో.. పడిపోతుంది. ఇలా వందల కోట్లు మోడీ ఖర్చు పెట్టేసి ఉంటారు. ఇవన్నీ వేరే ప్రభుత్వం వస్తే లెక్కలు బయటకు వస్తాయి.

ఇంత చేస్తున్న మోడీ మాత్రం … టీడీపీ అధినేత.. చేస్తున్న ఖర్చు గురించి చెబుతున్నారు. పార్టీ పరంగా కాకుండా.. కేవలం ప్రభుత్వం పరంగా.. నిరసన వ్యక్తం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఫెడరల్ వ్యవస్థలో.. కేంద్రం అనే దానికి ప్రత్యేకమైన అస్థిత్వం లేకపోయినా.. తమ రాష్ట్రాల నుంచి పన్నుల వాటాలతో ఆదాయం పొందుతూ..తమపైనే పెత్తనం చేస్తున్న వైనాన్ని అధికారికంగా..ఆయన నిరసన ద్వారా తెలియజేయాలనుకున్నారు. అందుకే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. దీనికే..మోడీ… ప్రజాధనం అంటూ.. విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్నది రాజకీయ పరమైన ఖర్చు అయితే.. మోడీ చేస్తున్నది అంతకు వంద రెట్లు ఎక్కువగా ఉంది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close