మోదీ ఎఫ్ డి ఐ దూకుడుపై – స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం!

పదిహేను కీలక రంగాలకు సంబంధించిన ఎఫ్‌డీఐ (ఫారిన్ డైరక్టు ఇన్వెస్ట్ మెంటు) నియమాలను సరళీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంపై స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) కూడా అభ్యంతరం చెబుతోంది.

ఎఫ్ డి ఐ లను అనుమతించినందుకు ఎన్ని అభ్యంతరాలు వస్తున్నాయో, నరేంద్రమోదీ వాటిని అనుమతించిన తీరుకు అంతకు మించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ ఫలితాలు చూసైనా మోదీ సంస్కరణల వేగాన్ని పునరాలోచించుకుంటారని రాజకీయపార్టీలు అంచనా వేశాయి. అందుకు భిన్నంగా ఆయన బ్రిటన్ పర్యటనకు ముందే ఎఫ్ డి ఐ ల్లో సవరణలను అనుమతులను ప్రభుత్వం ప్రకటించింది. 26 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలన్న ప్రజాస్వామిక ధర్మాన్ని, కనీసం కేబినెట్ సహచరులతో చర్చించాలన్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి విదేశీ కార్పొరేట్ల ను సంతోషపరడానికి రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేయించిన మోదీ దూకుడుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ – ఆర్ ఎస్ ఎస్ కు అనుబంధ సంస్ధ. ఎఫ్‌డీఐ లపై కేంద్రం తొందరపాటు ప్రదర్శిస్తోందని, ప్రస్తుతానికి దీనిని ఆపాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ సూచించింది.

ఎఫ్‌డీఐ లాభనష్టాలను వాటివల్ల ప్రభావితమయ్యే వారికి ముందుగా వివరించాలని, ఈ అంశాన్ని పరిశీలించేందుకు స్టేక్‌హోల్డర్లతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌జేఎం డిమాండు చేసింది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్‌ ఇండియా’, ‘మేడ్‌ బై ఇండియా’గా ఉండాలని సూచించింది. ఎఫ్‌డీఐ నియమాల సరళీకరణతో దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే లాభనష్టాలను అంచనా వేయండా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని, దీనిని సక్రమంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అందుకు స్టేక్‌హోల్డర్లతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌జేఎం అలిండియా కోకన్వీనర్‌ అశ్విని మహరాజ్‌ వ్యాఖ్యానించారు. అన్నారు.

గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరించటం బాధాకరమన్నారు. ఇంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ మరో అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్‌ సంఘ్ కూడా దీనిని వ్యతిరేకించింది. విదేశీ విధానాలను వదిలిపెట్టి అభివద్ధికి భారతీయ నమూనాను రూపొందించకోవాలని బిజెపికి సమన్వయ సమీక్షలో ఆర్ ఎస్ ఎస్ ఇప్పటికే సూచించింది.

ఇలా వుండగా సంస్కరణల ఫలితాలు మరో ఏడాదికి గాని కనిపించవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంటున్నారు. వ్యాపార నిర్వహణలో భారత్‌ ర్యాంకింగ్‌ 12 స్థానాలు మెరుగుపడినప్పటికీ తాము చేపట్టిన సంస్కరణల ఫలితాలను అది ప్రతిఫలించ లేదని వచ్చే ఏడాది నాటికి వాటి ప్రభావం తెలుస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో వ్యాపారం నిర్వహణలో భారత్‌ ర్యాంక్‌ 130కి మెరుగుపడింది. ప్రస్తుతం మెరుగుపడిన 12 ర్యాంకులు తాము తీసుకువచ్చిన సంస్కరణలను పూర్తి స్థాయిలో ప్రతిబింబించడం లేదని చెప్పారు. జూన్‌ 1 వరకే ఈ ర్యాంకింగ్‌లు ఇచ్చారని, కానీ తాము తీసుకున్న కొన్ని చర్యలు విజయవంతం కావడానికి సమయం పడుతుందని, వచ్చే ఏడాది ఈ ర్యాంక్‌ మరింత మెరుగుపడుతుందని వివరించారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close