తెలంగాణ బీజేపీకి రోడ్ మ్యాప్ ఇచ్చిన మోదీ !

తెలంగాణ బీజేపీకి ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి దగ్గరగా ఉన్నామని.. ఆ అధికారానికి దగ్గరగా వెళ్లాలంటే ఏం చేయాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ నేతలకు వివరంగా చెప్పారు. హైదరాబాద్ కార్పొరేటర్లందరితో మోదీ ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వారిని కలవాల్సి ఉన్నా.. సాధ్యం కాలేదు. దీంతో వారినే ఆయన ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడారు.

కార్పొరేటర్లను బీజేపీ అగ్రనేతలు మోదీ వద్దకు తీసుకెళ్లారు. మామూలుగా అయితే మోదీ అంత ప్రాధాన్యం ఇవ్వరని.. తెలంగాణ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టబట్టే కార్పొరేటర్లను పిలిపించి మరీ దిశానిర్దేశం చేశారని భావిస్తున్నారు. తెలంగాణలో విజయం సాధించాలంటే.. గ్రేటర్ తో పాటు చుట్టుపక్కల విజయం సాధించడం కీలకం. గతంలో ఎప్పుడూ లేనంతగా బీజేపీ విజయం సాధించింది. ఈక్రమంలో కార్పొరేటర్ల పాత్ర వచ్చే ఎన్నికల్లో కీలకం కానుంది. వారిలో నుంచి కొంత మంది ఎమ్మెల్యే అభ్యర్థులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమాచారం తెప్పించుకుని మరీ.. అంతర్గత సూచనలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తులు .. అమలు చేయాల్సిన వ్యూహాలపై మోదీ దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతల పనితీరు పట్ల మోదీ సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు.. రెండు, మూడు సార్లు వివిధ సందర్భాల్లో ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close