ఈ నెల 26 నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు

ఈనెల 26వ తేదీ నుండి డిశంబర్ 22వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఈ రోజు నిర్ణయించింది. ఇంతకు ముందు జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేల రాజీనామాలకు, వ్యాపం కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామాలకు పట్టుబడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉభయ సభలలో ఎటువంటి చర్చ జరగనీయకుండా పార్లమెంటుని స్తంభింపజేసాయి. ఈసారి బిహార్ ఎన్నికలలో బీజేపీని చావుదెబ్బ కొట్టి ఏకంగా 27సీట్లు గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహంతో ఉరకలేస్తోంది.

“బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో రచయితలపై దాడులు, మత అసహనం పెరిగిపోతోంది” అంటూ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు చేసిన ప్రచారానికి ప్రభావితమయిన అనేకమంది ప్రముఖులు, రచయితలు, కళాకారులు తమ అవార్డులను కేంద్రప్రభుత్వానికి వాపసు చేస్తుండటం, ఉత్తర ప్రదేశ్ లో మైనార్టీ వర్గాల మీద జరిగిన దాడులు వంటి అనేక అంశాలను అస్త్ర శస్త్రాలుగా చేసుకొని మోడీ ప్రభుత్వంపై దాడి చేయడానికి కాంగ్రెస్ చాలా ఎదురుచూస్తోంది. కనుక ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని దాని మిత్రపక్షాలను ఎదుర్కోవడం మోడీ ప్రభుత్వానికి చాలా కష్టం కావచ్చును. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దానికి పార్లమెంటులో ఎదురుపడాలంటే కాంగ్రస్ చాలా భయపడేది. అందుకే లోక్ సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్దేదుకు రాహుల్ గాంధీ నిరాకరించి, వెనుక బెంచీలలో కునుకు తీసేవారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి వ్యతిరేకమయిన పరిస్థితి కనిపిస్తోంది. తమ ప్రభుత్వంపై ముప్పేట దాడులు చేస్తున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక మోడీ ప్రభుత్వం దిగులు పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close