మోడీ ప్రధాని కాక ముందే భారత్ కూడా శ్రీలంకలాగే ఉండేదట..!

మోడీగారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఇండియా ఎలా ఉండేది..?. ఈ ప్రశ్నకు.. ఎవరి.. సబ్జెక్ట్‌గా తగ్గట్లుగా వారు సమాధానం చెబుతారు. విద్యావేత్తలు… తమ దేశం సాధించిన గొప్ప.. గొప్ప ఆవిష్కరణల గురించి చెబుతారు. ఆర్థిక వేత్తలు.. దేశం సాధించిన పురోగతిని విశ్లేషిస్తారు. పారిశ్రామిక రంగ ప్రముఖులు… అదో స్వర్ణయుగం అంటారు. కానీ.. మోడీ మాత్రం… తాను అధికారంలోకి రాక ముందు.. ఇండియా ఎలా ఉందంటే.. ఏం చెబుతారనుకున్నారు…?. ఇప్పుడు శ్రీలంక ఎలా ఉండేదో… భారత్ అలా ఉండేదట. బాంబు పేలుళ్లతో .. ఉగ్రదాడులతో అతలాకుతలమైపోతున్న శ్రీలంకను.. చూసి.. భారత్ ఒకప్పుడు అలా ఉండేదని చెప్పడానికి.. సామాన్యులకే మనసు రాదు. కానీ..మోడీ మాత్రం.. అలా అనేశారు.

ఉగ్రదాడులతో అతలాకుతలమైపోతున్న ఇండియాను.. తానే కాపాడినట్లు… ప్రకటించుకోవడానికి మోడీ… శ్రీలంక దాడులను కూడా వాడుకున్నారు. మహారాష్ట్రలో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోడీ.. భారత్‌పై ఇలా కించపరిచే మాటలు మాట్లాడారు. వందల మంది ప్రాణాలు తీసిన కొలంబో పేలుళ్ల తరహా పరిస్థితి.. 2014కు ముందు దేశంలో ఉందని చెప్పుకొచ్చారు. ముంబై, పుణె, హైదరాబాద్‌లాంటి చోట్ల పేలుళ్లు జరుగుతూనే ఉండేవట. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పరిస్థితిని మార్చారట. పఠాన్ కోట్ , ఉరి, పుల్వామా.. ఇలా.. ఎన్నో భారీ.. ఉగ్రవాద ఘటనలు మోడీ హయాంలో జరిగాయి. కానీ.. ఆయన మాత్రం.. చరిత్రలో జరిగిన వాటిని మాత్రమే చెబుతున్నారు. అయినా అసలు ఈ సందర్భంలో.. శ్రీలంక పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందని.. వెటకారం చేయడమే కాదు… ఆ దేశంలా ఒకప్పుడు భారత్ ఉండేదంటూ.. చెప్పుకు రావడం… అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

శ్రీలంకకు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతున్న కొలంబో పేలుళ్లను కూడా.. మోదీ రాజకీయానికి వాడుకుకోవడాన్ని విపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. రాజకీయం కోసం మోదీ ఎంతకైనా దిగజారుతారనేందుకు..కొలంబో పేలుళ్లపై వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ..మోడీ ప్రధాని స్థాయిని దిగజార్చుకుని మరీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. ఇది ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది. అయితే మోడీ మాత్రం తన దారిలో తాను వెళ్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close