మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా.. నిర్మాత‌లు పెరిగారా?

రాజ‌మౌళి సినిమా అంటే.. ఇప్పుడు రూ.1000 కోట్ల బ‌డ్జెట్ మినమం ఉండాల్సిందే. దానికి రెట్టింపు రాబ‌ట్టుకోవ‌డం ఎలాగో రాజ‌మౌళికి కూడా బాగా తెలుసు. అందుకే రాజ‌మౌళి సినిమాకి ఎంత బ‌డ్జెట్ పెడుతున్నా – అదేం భారంగా అనిపించ‌దు. రాజ‌మౌళి – మ‌హేష్‌బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాకి దాదాపు రూ.1500 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్న‌ట్టు టాక్. అదే నిజ‌మైతే… మ‌న దేశంలోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందే సినిమా ఇదే అవుతుంది. కె.ఎల్.నారాయ‌ణ ఈ చిత్రానికి నిర్మాత‌. అయితే.. రాజ‌మౌళికి ఆయ‌నొక్క‌డిపైనే భారం వేయ‌డం ఇష్టం లేదు. అందుకే.. రాజ‌మౌళి సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనున్నార్ట‌. ఆయ‌న‌కు పారితోషికం అంటూ ఏం ఉండ‌దు. లాభాల్లో వాటా తీసుకొంటారు. ఇప్పుడు ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌లు కూడా చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆర్కా మీడియా, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు ఈ చిత్రంలో భాగ‌స్వామ్యం అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. వాళ్లిద్ద‌రూ తెర వెనుక ఉంటారా? లేదంటే అఫీషియ‌ల్‌గానే నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇప్ప‌టికే మొద‌లైపోయాయి. ఈ యేడాది చివ‌ర్లో కానీ, 2024 ప్ర‌ధ‌మార్తంలో కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close