2026 వరకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంపు సాధ్యం కాదు: జైరాం రమేష్

మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చాలా ఆసక్తికరమయిన విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2026 సం.వరకు శాసనసభ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని తెలిపారు. అంతవరకు సీట్ల పెంపుపై రాజ్యాంగంలో సీలింగ్ విధించబడి ఉంది కనుక సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయాన్నీ ఆయన డిల్లీలో సాక్షి మీడియాకి తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఇంకా దీని గురించి ఆయన ఏమని చెప్పారంటే, “జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత దానికీ ఇదే సమస్య వచ్చింది. జార్ఖండ్, కేరళ రాష్ట్రాలలో ఇంచుమించి సరిసమానంగా జనాభా ఉన్నప్పటికీ జార్ఖండ్ శాసనసభలో కేవలం 81 సీట్లే ఉండగా, కేరళలో మాత్రం 140 ఉన్నాయి. కనుక జార్ఖండ్ లో కూడా మరో 59 సీట్లు పెంచాలని నేను రెండేళ్ళ పాటు గట్టిగా కృషి చేసినా, ఆ 2026 సీలింగ్ కారణంగానే అది సాధ్యపడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. విభజన చట్టంలో సెక్షన్-26 ఆర్టికల్ 170కి లోబడి చట్ట సవరణ చేయడం ద్వారా సీట్లు పెంచుకొనే అవకాశం ఉంది. అయితే అందుకు అన్ని రాజకీయ పార్టీలు సమ్మతించి, సహకరించాల్సి ఉంటుంది. అప్పుడే అది సాద్యం అవుతుంది. కానీ దేశంలో చాలా రాష్ట్రాల నుంచి అసెంబ్లీ సీట్ల పెంపుకి డిమాండ్లు వస్తున్నందున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి మాత్రమే సీట్లు పెంచడం సాధ్యం కాకపోవచ్చు. దీనిపై పార్లమెంటరీ శాఖ మంత్రి వెంకయ్య నాయుడే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఏమయినప్పటికీ రెండు రాష్ట్రాలలో సీట్లు పెరుగబోతున్నాయనే ప్రచారంతో పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం సరి కాదు,” అని జైరాం రమేష్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close