మజ్ను క‌ష్టాలు… గ‌ట్టిగా లాగు హైలెస్సా…!

అఖిల్ మూడో చిత్రం ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఈ సినిమాతో మ‌రో డిజాస్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు అఖిల్‌. శుక్ర‌, శ‌ని, ఆదివారాలు సైతం వ‌సూళ్లు లేవు. ఇక సోమ‌వారం నుంచి క‌ల‌క్ష‌న్ల గురించి ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయినా స‌రే – ఈ సినిమాని గ‌ట్టెక్కిద్దామ‌ని చిత్ర‌బృందం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగా ‘విజ‌య యాత్ర‌’ (?) ని చేప‌ట్టించి చిత్ర‌బృందం. తెలుగు రాష్ట్రాల‌లో ప‌ర్య‌టిస్తూ… థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తూ… ‘మా సినిమా బాగానే ఉంది’ అంటూ మైకులు ప‌ట్టుకుని స్పీచులు దంచేస్తున్నారు.

సినిమా ఫ్లాప్ అయినా, ఆ విష‌యం చిత్ర‌బృందానికి తెలిసిపోయినా.. ఇలా థియేట‌ర్ యాత్ర చేయ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఈ శుక్ర‌వారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌కు కొత్త సినిమాలేం రావ‌డం లేదు. వ‌చ్చే వారం కూడా ‘యాత్ర‌’ మిన‌హా మ‌రో సినిమా ఏం లేదు. ఈలోగా.. థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే చాలా త‌క్కువ ఆప్ష‌న్స్ ఉన్నాయి. అందుకే వీలైనంత వ‌ర‌కూ ‘మ‌జ్ను’ని ప్ర‌మోట్ చేసి, కాస్తో కూస్తో వ‌సూళ్లు రాబ‌ట్టుకుని, న‌ష్ట భారాన్ని త‌గ్గించుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అఖిల్ కూడా `మిస్ట‌ర్ మ‌జ్ను` ఫ్లాప్ అంటే ఒప్పుకోవడం లేదు. ”నా నుంచి వ‌చ్చిన మిగిలిన రెండు సినిమాలకంటే.. మ‌జ్ను బెట‌ర్‌గానే ఉంది” అని చెప్పుకుంటున్నాడు. గుడ్డికంటే మెల్ల న‌యం అంటే ఇదే క‌దా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close