భార్యాసమేతంగా ఆమరణదీక్షకు ముద్రగడ నిర్ణయం

హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చటం, కాపు కమిషన్‌కు వేయికోట్లు కేటాయించటంపై ఉద్యమానికి దిగిన ముద్రగడ పద్మనాభం ఆమరణదీక్షకు దిగుతానని ఇవాళ ప్రకటించారు. భార్యతో కలిసి నాలుగైదు రోజుల్లో దీక్షకు కూర్చుంటానని చెప్పారు. కిర్లంపూడిలో తన స్వగృహంలో ఆయన ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.

  • అరెస్ట్ చేసినా జైలులో కూడా నిరాహారదీక్ష చేస్తా.
  • కాపులకు న్యాయం జరిగేవరకు విశ్రమించను.
  • నిన్న ఉద్యమం తప్పుదోవ పడుతోందని గ్రహించి ఆందోళనను విరమించాను.
  • నిన్న జరిగిన అల్లర్ల వెనక టీడీపీ నాయకుల హస్తం ఉంది.
  • అల్లరిమూకలకు నాయకత్వం వహించింది టీడీపీవారే.
  • నేను అమ్ముడైపోయినట్లు ప్రచారం చేస్తున్నారు.
  • నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేశాను. ఆనాడు నన్ను మీరు ఎన్నికోట్లకు కొన్నారో చంద్రబాబు చెప్పాలి.
  • నిన్న కాపుగర్జన సభను అడ్డుకోటానికి అన్ని ప్రయత్నాలూ చేశారు.
  • స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవ్వనీయకుండా చేశారు.
  • వంట చేసుకోవటానికి జాగా కూడా ఇవ్వనీయలేదు.
  • నిధులు లేవంటున్నారు, ప్రతిచోటకూ సీఎమ్ ప్రత్యేక విమానంలోనే తిరుగుతున్నారు.
  • అమరావతి శంకుస్థాపనకు 400 కోట్లు ఖర్చుపెట్టారు, పట్టిసీమకు 1500 కోట్లు ఖర్చుపెట్టారు.
  • కాపులు ఎవరూ ఆవేశానికి లోనుకావద్దు, ఇళ్ళు వదిలి ఎక్కడికీ రావద్దు. మీప్రాంతాలనుంచే సంఘీభావం ప్రకటించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close