జగన్ నుంచి మోడీపైకి గురి మార్చిన ముద్రగడ..!

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం… తన జాతి రిజర్వేషన్ల కోసం ఎవరితో పోరాడాలన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో.. చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను క్యాన్సిల్ చేసిన జగన్‌ను నిందించారో… చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన.. ఐదు శాతం కోటా రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించలేదని.. ప్రధాని మోడీని డిమాండ్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్లుగా.. తాజా లేఖలు బయట పెడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీకి.. ముద్రగడ పద్మనాభం నేడు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే.. చంద్రబాబు.. కాపులను బీసీల్లో చేర్చుతూ.. ఐదు శాతం కోటా ఇచ్చారని.. ఆ కోటాకు ఆమోద ముద్రవేయాలని.. కోరడం. లేఖలో.. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని.. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి తీసేశారని మొదటగా గుర్తు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయాలని కోరారు.

ఇటీవలి కాలంలో ముద్రగడపై ఒత్తిడి పెరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లు జగన్ క్యాన్సిల్ చేసినా.. ఎలాంటి పోరాట ప్రణాళిక ప్రకటించడం లేదని.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఏ కోర్టు కొట్టి వేయనప్పటికీ.. ఎందుకు… ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాల్సి వచ్చిందో… ముద్రగడ లేఖ రాసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా ముద్రగడ లైట్ తీసుకున్నారు. రిజర్వేషన్ల కోసం.. ఏదో ఓ ఉద్యమం చేయాలని… ఆయనపై ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్ పై ఉద్యమం చేయడానికి ఆయన సిద్దంగా లేరని… అందుకే.. వీలైనంతగా.. దాన్ని కేంద్రం వైపు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పీఎంవోకి చేరుతుందో లేదో కానీ… ఆయన.. తెలుగులో లేఖ రాశారు. ప్రధాని.. లేదా.. ఇతర ఢిల్లీ స్థాయి వ్యవహారాల్లో అధికార ఉత్తరాలు.. ఇంగ్లిష్‌లోనే రాస్తారు. అలా రాస్తేనే.. కాస్త వెసులుబాటు అక్కడ ఉండే అధికారులకు ఉంటుంది. లేకపోతే.. ప్రాధాన్యత క్రమంగా పక్కన పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. ముద్రగడ మాత్రం.. ఎప్పుడు.. ఎవరికి లేఖలు రాసినా.. తెలుగులోనే రాస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకూ అయితే.. ఎవరూ పట్టించుకోరు కానీ.. మోడీకి కూడా.. తెలుగులోనే రాస్తూండటంతో.. ఆయన చిత్తశుద్ధి మీద… కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close