ఇంతకీ ముద్రగడ దీక్ష చేస్తునట్లా లేనట్లా?

మూడు రోజుల క్రితం చిరంజీవి, దాసరి నారాయణ రావు, పల్లంరాజు తదితర కాపు నేతలందరూ పార్క్ హయత్ హోటల్లో సమావేశమయ్యి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమింపజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు రోజులు డెడ్ లైన్ విధించారు. ఆ మర్నాడే ప్రభుత్వం దిగి వచ్చి ముద్రగడతో మంతనాలు సాగించింది. కొందరు కాపు నేతలు కూడా ఆయనని కలిసి మాట్లాదారు. ప్రభుత్వం తరపున వారు ఆయనకి ఏమి హామీ ఇచ్చారో తెలియదు కానీ ముద్రగడ వైద్యానికి అంగీకరించి సెలైన్ ఎక్కించుకొన్నారు. కానీ మళ్ళీ మర్నాడే ముద్రగడ దీక్షని కొనసాగిస్తున్నారని ఆయన కుమారుడు ప్రకటించారు. ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడిన రాజమండ్రి ఆసుపత్రి వైద్యులు ఇంతవరకు ఆయనకి మూడు సలైన్ బాటిల్స్ సలిన్ ఎక్కించామని చెప్పారు. నిన్న సాయంత్రం కూడా మళ్ళీ రక్త నమూనా తీసుకొని దాని నివేదికని బట్టి నిన్న రాత్రి మరో సెలైన్ బాటిల్ ఎక్కించామని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యానికి పూర్తిగా సహకరించడం లేదని అన్నారు. నోటి ద్వారా ఆహారం తీసుకొంటేనే ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగవుతుందని చెప్పారు. ముద్రగడ అనుచరులు మాత్రం ఇప్పటికీ ఆయన నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉందని చెపుతున్నారు.

తన డిమాండ్లన్నీ నెరవేరేవరకు ముద్రగడ పద్మనాభం కటోర నిరాహార దీక్ష చేసి ఉంటే కాపుల సానుభూతి పొందగలిగేవారు. మిగిలిన వర్గాల ప్రజలు కూడా ఆయనని వేలెత్తి చూపగలిగేవారు కాదు. కానీ ఒకపక్క సెలైన్ బాటిల్స్ ఎక్కించుకొంటూ, మంచి నీళ్ళు త్రాగుతూ దీక్ష కొనసాగిస్తున్నామని చెప్పుకోవడం వలన ఆయనే నవ్వులపాలవుతారు. పైగా ఇటువంటి వార్తలు వెలువడుతున్నపుడు దీక్ష చేస్తున్నట్లా? కాదా అనే అనుమానాలు, విమర్శలు వినవలసి ఉంటుంది.

ఆయన చేత దీక్ష విరమింపజేసే వరకు పరుగులు తీసిన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆయన దీక్ష గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఈవిధంగా ఇంకా ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేసినా ప్రయోజనం ఉండకపోగా, ఏదో ఒకరోజు దీక్ష విరమిస్తున్నానని ప్రకటించి ఇంటికి వెళ్లిపోయినట్లయితే, ఆయనే నలుగురిలో నవ్వులపాలవుతారు. కనుక ముద్రగడ పద్మనాభం తక్షణమే తన దీక్షని విరమించి, మళ్ళీ అందరితో సమావేశమయ్యి కార్యాచరణ నిర్ణయించుకొంటే మంచిదేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close