ముద్రగడ మార్క్ – ఆకస్మిక కార్యాచరణ

కాపులను బిసిలుగా చేర్చాలన్న ఉద్యమాన్ని వెనక్కి వెళ్ళనీయకుండా ముద్రగడ పద్మనాభం లాక్ వేశారు. రిజర్వేషన్ పై ప్రభుత్వం జిఓ జారీ చేసేవరకూ రోడ్డుమీదో, రైలు పట్టాల మీదో వుందాం! నేనూ నా కుటుంబం ఇక్కడినుంచి ఇంటికి వెళ్ళదు…రోడ్డుమీదికే…మీరూ రండి అని సభాముఖంగా పిలుపు ఇచ్చారు.

దీంతో తునివద్ద రైలు, రోడ్డు దిగ్భంధనం ఆకస్మికంగా మొదలైంది. ఇది మాస్ మిలిటెన్సీకి, ఉద్రిక్తతలకు దారితీసే పరిస్ధితి వుంది. ముద్రగడ డిమాండ్ ప్రకారం తక్షణం జివో విడుదల అయ్యే పరిస్ధితులు సాంకేతికంగా లేవు. ఏ తాళానికి తలుపు తెరుచుకుంటుందో తెలియని స్ధితిలో తలుపు వెనుక ఎన్ని గంటలు, ఎన్నిరోజులు వేచివుండాలో ఆందోళనకారుల అంచనాకు అందని స్ధితి తలెత్తింది.

కాపు ఐక్యగర్జనలో ఉద్యమకార్యాచరణను ప్రకటిస్తామన్న ముద్రగడ పద్మనాభం కార్యాచరణను ఆకస్మికంగా మొదలు పెట్టేయడం టివిలు చూస్తున్న అధిపార పక్షం పెద్దలకంటే సభకు తరలి వచ్చిన కాపు నాయకులకు, వేర్వేరు రాజకీయ పార్టీల్లోని కాపు ప్రముఖులకు పెద్ద షాక్ ఇచ్చాయి.

కార్యక్రమాన్ని రూపొందించి, సిద్ధమై వచ్చిన ముద్రగడ ఎన్నిరోజులైనా రోడ్డు మీదా, రైలు పట్టాలమీదే వుందాం మీరూ రండి అని అందరికీ విజ్ఞప్తి చేయడం ఉద్యమానికి సిద్ధం కాకుండా వచ్చిన ఇతర నాయకులకు సంకటంగా పరిణమించింది. ఏ ప్రిపరేషన్ లేని వారు రోడ్డు మీద వుండలేరు,వెళ్ళిపోనూలేరు.

ముద్రగడ కార్యాచరణలో కార్యాచరణలో మొండితనం ఇలాగే వుంటుంది. స్పష్టమైన హామీ వచ్చేదాకా ఆయన పోరాటం ఆగదు. నిరాహారదీక్షలైనా అంతే…తుపాకితో గదిలో కూర్చుని బలవంతంగా తలుపు తీస్తే కాల్చుకుంటానన్న హెచ్చరికా అంతే…ఇపుడు వేలాదిమందితో జాతీయరహదారి మీద ఆగిపోవడమంటే ట్రాఫిక్ క్లియర్ చెయ్యాడానికి పోలీసుల ప్రవేశం అనివార్యమౌతుంది. ఇది ఉద్రిక్తతలను పెంచుతుంది.

ఈ ఉద్యమంపై తెలుగుదేశంలో వున్న కాపునాయకులు స్పందించడం లేదు. ముద్రగడ ఒంటెత్తు పోకడల వల్లే కాపు నాయకులు ఆయనకు దూరమయ్యేవరకూ వేచి వుండాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఎవరు వున్నారు ఎవరు వెళ్ళారు అన్నది ముద్రగడ పట్టించుకోరు. తాను అనుకున్నదే చేస్తారు.

మొండితనమే ముద్రగడ బలమూ, బలహీనతా కూడా! ఆయన ఎవరిమాటా వినడు ఎవరైనా ఆయన మాటే వినాలి అనే ధోరణి వల్లే ఆయనతో ఏ రాజకీయ నాయకుడూ సన్నిహితంగా వుండరు.

కాపులు తనవెంట వున్నారన్నదే ముద్రగడ పద్మనాభం ధీమా! బలం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close