అమలాపురంలో ముద్రగడ ధర్నా..ఏమిటి అర్ధం?

కాపుల నేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. కాపు ఐక్య గర్జన సభ తరువాత తునిలో జరిగిన విద్వంసానికి కారకులైన కొందరిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో, అందుకు నిరసనగా ఆయన దీక్షకి కూర్చొన్నారు. తుని ఘటనలకు తనదే బాధ్యత అని చెపుతున్నా వినకుండా పోలీసులు అమాయకులని విచారణ పేరిట వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న అరెస్ట్ చేసిన వారినందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కావాలంటే తనను అరెస్ట్ చేయవచ్చని ముద్రగడ వాదిస్తున్నారు. పోలీసులు ఆయనకి నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేవరకు తను ధర్నా విరమించనని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలాపురంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

తునిలో జరిగిన విద్వంసం, దాని వలన రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి అందరికీ తెలుసు. దానికి కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేయడానికి పోలీసులకి సహాయపడవలసిన ముద్రగడ పద్మనాభం, వారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. అంటే అంత తీవ్రమైన నేరానికి పాల్పడిన వారిని ఆయన స్వయంగా వెనకేసుకొనివస్తునట్లు లేదా వారిని ఉపేక్షించమని కోరుతున్నట్లు ఉంది. చట్టం తనపని తాను చేసుకుపోకుండా ఆయన అడ్డు పడుతున్నట్లుంది. తుని విద్వంసానికి తనదే బాధ్యత అని ఆయన వాదిస్తున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు అందులో పాల్గొన్నారని స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఆయన వాదన అర్ధరహితం. ఆ విద్వంసంపై పోలీసులు కేసులు నమోదు చేయడం, దానిపై దర్యాప్తు, అనుమానితులని అరెస్ట్ చేయడం వంటివన్నీ ఆయన వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లవుతోంది. ఒకవేళ ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు కలుగజేసుకొంటే మొదట ఇబ్బంది పడేది ఆయనేననే సంగతి మరిచిపోతున్నారు. కనుక ఈ వ్యవహారంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close