తుని ఘటనలకు బాధ్యుడిని కాను: ముద్రగడ

ఇటీవల మీడియాలో తుని విద్వంసంపై సి.ఐ.డి. దర్యాప్తు వేగవంతం అయ్యిందని వార్తలు వచ్చేయి. విద్వంసం జరిగిన రెండు రోజులలో స్థానిక సెల్ టవర్ల నుంచి వెళ్ళిన ఫోన్ కాల్స్ డాటా, కొందరు స్థానికులు అందజేసిన వీడియో క్లిప్పింగుల ఆధారంగా ఆ విద్వంసానికి పాల్పడినవారిని, వారి వెనుక బడా నేతలని గుర్తించడానికి సి.ఐ.డి. పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేసారని వార్తలు వచ్చేయి.
ఆ వార్తలపై ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ “పేపర్లలో అటువంటి వార్తలు వ్రాయించినంత మాత్రాన్న నేను భయపడిపోను. నేను కాపులకు రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమానికి మాత్రమే నాయకుడిని తప్ప తుని విద్వంసానికి కాదు. కనుక ప్రభుత్వం నన్ను భయపెట్టే ఆలోచన మానుకొంటే మంచిది. ఒకవేళ సి.ఐ.డి. పోలీసులు అవసరమనుకొంటే నన్ను కూడా విచారించవచ్చు. నేను ఎప్పుడూ వారికి అందుబాటులోనే ఉంటాను. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోనందునే నేను ఉద్యమించవలసి వచ్చింది. నేను ఉద్యమించబట్టే కాపులకు ఆ మాత్రం న్యాయం జరిగింది. కనుక ప్రభుత్వం మాట తప్పితే మళ్ళీ నేను రోడ్డెక్కడం ఖాయం. ఇకనయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో కాపుల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది,” అని అన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల రాజప్ప కూడా తుని ఘటనలపై మాట్లాడటం యాదృచ్చికం కాదని భావించవచ్చు. ఆయన నిన్న గుంటూరులో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ “ప్రాధమిక విచారణలో తుని ఘటనల వెనుక రౌడీ షీటర్లు ఉన్నట్లు సి.ఐ.డి. పోలీసులు గుర్తించారు. వారు తమ నివేదిక ఇవ్వగానే దోషులపై చర్యలు చేపడతాము. ఎంత పెద్దవారయినా విడిచిపెట్టే ప్రసక్తే లేదు,” అని అన్నారు.
ఈ కేసులో విద్వంసానికి పాల్పడిన వారిని శిక్షించడం కంటే రాజకీయాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అవేమిటో ముద్రగడ స్పందన చూస్తే అర్ధమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close