మీడియా చేసినంత దుర్మార్గం మా జీవితాల్లో ఎవరు చేయలేదు: నాగబాబు

సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా హాట్ టాపిక్ ఉంటే దాని గురించి మీడియా చూపిస్తుంది, చర్చిస్తుంది. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మీడియానే హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు టీవీ9 నుండి సీఈఓ రవిప్రకాష్ ని ఉద్వాసన పలకడం గురించి రాష్ట్రంలో వాడివేడిగా చర్చింపబడుతూ ఉండగానే, మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఒక ప్రైవేటు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ, తమ కుటుంబానికి మీడియా చేసినంత అన్యాయం, దుర్మార్గం మరెవరూ చేయలేదు అని వాపోయారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు హీరోలా ఉన్న చిరంజీవిని పార్టీ పెట్టగానే జీరో అయ్యేలా ఒక వర్గం మీడియా చేసిందా అని రిపోర్టర్ ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానమిస్తూ నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రెండు రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు తమకు వత్తాసు పలికే మీడియా చానళ్ల సహాయంతో చిరంజీవిపై చాలా దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న సాక్షి కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కొన్ని మీడియా సంస్థలు మరీ దారుణంగా ప్రవర్తించాయని అన్నారు. చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ అయితే, తమ పొలిటికల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుందన్న ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగా గా చిరంజీవిని సమర్థిస్తున్నట్లు గానే నటిస్తూ, చివరికి వచ్చేసరికి చిరంజీవి వ్యక్తిత్వాన్ని హననం చేసే లాగా, అనేక కథనాలు వండి వార్చారు అని నాగ బాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా కాస్త సోషల్ మీడియా ఉండడం వల్ల తమ మీద జరిగే మీడియా దాడులను ఎదుర్కోగలుగుతున్నామని, కానీ అప్పట్లో ఎటువంటి మీడియా అండ లేకపోవడంతో మీడియా చేసిన దురాగతానికి ( ఎమోషనల్ అత్యాచారం) తాము ఇబ్బంది పడాల్సి వచ్చిందని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా ప్రజారాజ్యం పార్టీ గురించి ఎప్పుడు ఎక్కడ చర్చ జరిగినా, మిగతా కారణాలతో పాటు ఆ పార్టీ విషయంలో ఒక వర్గం మీడియా ప్రదర్శించిన వైఖరి కూడా చర్చలోకి రావడం పరిపాటిగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close