అక్కినేని హీరోలకు మాత్రమే ఎందుకిలా?

పాపం అక్కినేని హీరోలకు మాత్రమే ఎందుకిలా జరుగుతోందో? మీతో ఒక సినిమా చేయాలనుందని మాట మాత్రంగా వాళ్ళకు ఓ ముక్క కూడా చెప్పకుండా దర్శకులు లీకులు ఇస్తున్నట్టున్నారు. బహుశా… ఈ లీకులు చూసి కథ చెప్పమని అక్కినేని హీరోల నుంచి పిలుపు వస్తుందనే ఆశ అనుకుంట. గురువారం న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వార్త చూసి అక్కినేని నాగచైతన్య షాక్ తిన్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ శిష్యురాలు సౌజన్య దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్ జంటగా కొత్త సినిమా శ్రీకారం చుట్టుకుందని సదరు వార్తలో రాశారు. మే మంత్ ఎండ్ లేదా జూన్ స్టార్టింగులో షూటింగ్ స్టార్ట్ అవుతుందని రాశారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’, మారుతి దర్శకత్వంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలు చేస్తున్న నాగచైతన్య ఈ వార్త చూసి ఖంగుతిన్నాడు. ట్విట్టర్లో మీరు వింటున్న వార్త నిజం కాదని ట్వీట్ వేశాడు.

అక్కినేని హీరోలు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అది నిజం కాదంటూ క్లారిటీ ఇవ్వడం కొత్తేమి కాదు. గతేడాది జనవరిలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా ఒక ముల్టీస్టారర్ స్టార్ట్ అవ్వబోతుందని ప్రముఖ పత్రికలో వార్త వచ్చింది. ‘ఇది నాకు కూడా వార్తే’ అని అప్పట్లో నాగ్ ట్వీట్ చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని స్వయంగా నిర్మాత దిల్ రాజు ఒక విలేకరుల సమావేశంలో చెప్పాడు. తర్వాత నాగార్జున మీడియా ముందుకు వచ్చినప్పుడు కథతో నా దగ్గరకు రాలేదని ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఏంటో అక్కినేని హీరోలకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.