కృష్ణమ్మ సాక్షిగా చంద్రబాబు ప్రతిజ్ఞ.. ప్రతిపక్షాలకి మరో ఆయుధం

ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్న మాట వాస్తవం. ప్రత్యేక హోదా రాదనే సంగతి ఆయనకి ముందే తెలిసి ఉన్నప్పటికీ, ఆ విషయం ప్రజలకు చెప్పే ధైర్యం లేక వారిని మెల్లిగా ఆ విషయం గ్రహించేలా చేసేందుకే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని భావించవచ్చు. కానీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో వేడి పెరిగినప్పుడల్లా ఆయన కూడా ప్రజలు, ప్రతిపక్షాలతో కలిసి కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రజాగ్రహం తనపైకి మళ్ళకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంగతి ప్రజలు అర్ధం చేసుకొన్నారు. వారికి అర్ధం అయిందనే సంగతి ముఖ్యమంత్రికి తెలుసు. అంతేకాదు ఈవిధంగా మాట్లాడుతుండటం వలన ప్రజలు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని పోగొట్టుకొంటున్నామని, తెదేపాకి చాలా నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రికి కూడా తెలుసు. కానీ వేరే మార్గం కనబడకపోవడంతో ఆయన అదే పద్దతిలో రెండేళ్లుగా ముందుకు సాగిపోతున్నారు.

నిన్న కృష్ణానది వద్ద హారతి కార్యక్రమం తరువాత అయన కృష్ణమ్మ సాక్షిగా విభజన చట్టంలోఇచ్చిన హామీలనన్నిటినీ అమలయ్యే వరకు కేంద్రప్రభుత్వంతో పోరాడుతానని ప్రతిజ్ఞ చేశారు. అయితే అటువంటి ప్రతిజ్ఞలు చేయడం వలన ఆయన ఇంకా ఆ ఊబిలో కూరుకుపోతారే తప్ప దాని నుంచి ఎప్పటికీ బయటపడలేరని చెప్పవచ్చు. పైగా ‘కృష్ణమ్మ సాక్షిగా చేసిన ఆ ప్రతిజ్ఞ’ కూడా ప్రతిపక్షాలకి మరొక ఆయుధంగా అందించినట్లవుతుంది.

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు తన పార్టీకి నష్టం కలగకుండా రక్షించుకొనేందుకు ఏదో దీర్గకాలిక వ్యూహంతోనే ముందుకు సాగుతుండవచ్చు. కానీ పార్టీ కోసం, తమ నేతల స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని కూడా తాకట్టు పెడుతున్నారనే వైకాపా ఆరోపణలే ప్రజలకు బాగా చేరుతున్నాయనే సంగతి ఆయన గుర్తించడం కూడా చాలా ముఖ్యం.

నిజానికి ఏపికి ప్రత్యేక హోదా వగైరా హామీలన్నీ అమలయ్యి ఉండి ఉంటే శరవేగంగా రాష్ట్రాభివృద్ధి చేయగలిగి ఉండేవారు. అప్పుడు ఆ క్రెడిట్ ఆయనకే దక్కి ఉండేది. దాని వలన రాష్ట్రానికి మేలు కలగడమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనకి, తెదేపాకి కూడా ప్రజాధారణ చాలా పెరిగి ఉండేది. కనుక ఆయన తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారనే ప్రతిపక్షాల వాదన సరికాదనే చెప్పవచ్చు. ఒకవేళ ఆయన స్థానంలో మరెవరున్నా, మరే పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో ఇదేవిధంగా వ్యవహరించక తప్పదు. కానీ కాంగ్రెస్, వైకాపాలు ప్రతిపక్షంలో ఉన్నాయి కనుక ఏమైనా మాట్లాడగలవు. ఏమైనా డిమాండ్ చేయగలవు.

వాటి విమర్శలని, ఆరోపణలని, డిమాండ్స్ ని ప్రభుత్వం పట్టించుకోకపోయినా వాటి వలన జరుగుతున్న నష్టాన్ని మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయినా, ప్రజాభీష్టాన్ని గుర్తించలేకపోయినా శాపకారణంగా కర్ణుడికి కురుక్షేత్ర యుద్దంలో సమయానికి అస్త్రశస్త్రాలు పనిచేయనట్లే వచ్చే ఎన్నికల సమయంలో ఏ వ్యూహాలు పనిచేయకపోవచ్చు. కనుక ఇప్పటికైనా తెదేపా-భాజపాలు తమలో తాము కీచులాడుకోవడం మానుకొని రెండూ కలిసి ప్రజల ముందుకు వచ్చి వాస్తవ పరిస్థితులని వివరించి, రాష్ట్రాభివృద్ధికి తమ ప్రతిపాదనలని వారి ముందు ఉంచి నచ్చజెప్పితే మంచిది. లేకుంటే చివరికి వారే నష్టపోయే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close