ప్రభుత్వ సహకారం కోసం భారతిని కలిసిన నమ్రత..!

సినీనటుడు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతితో సమావేశమయ్యారు. మహేష్ బాబు దత్తత తీసుకున్న సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మిగిలిపోయిన పనులకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఇంత వరకూ బాగానే ఉంది. ప్రభుత్వం తరపున సహకారం కావాలంటే… ప్రభుత్వంలోని వారిని కలవాలి. కానీ.. వైఎస్ భారతిని కలవాల్సిన అవసరం ఏముందనేది… చాలా మందికి అర్థం కాని విషయం. తన భర్త ముఖ్యమంత్రి అయినందున.. వైఎస్ భారతి కూడా అధికార విధుల్ని పంచుకుంటున్నారా…అనే ప్రశ్న వస్తోంది.

బుర్రిపాలెంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే… సంబంధిత అధికారులు.. లేకపోతే మంత్రి… లేకపోతే.. స్థానిక ఎమ్మెల్యే.. ఇంకా పలుకుబడి ఉంది కాబట్టి… ముఖ్యమంత్రిని కలిసినా రీజనబుల్ గా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి సతీమణని కలిసి ప్రభుత్వ సహకారం కోరడమే ఎబ్బెట్టుగా ఉంది. బుర్రిపాలెం విషయంలో మహేష్ బాబు… పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి… ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి పనులు చేస్తున్నారు. కానీ కొత్త ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఆగిపోయిందని చెబుతున్నారు. మధ్యలో ఉన్న పనుల్ని… పూర్తి చేయడానికి స్వయంగా నమ్రతనే విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

మహేష్ బాబు నేరుగా వచ్చి కలవలేరు కాబట్టి… నమ్రత … భారతీతో చెప్పి పనులు పూర్తి చేసుకోవాలనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంలో మంత్రులను కూడా పని చేయనివ్వడం లేదని.. అంతా జగన్ బంధువుర్గమే.. వ్యవహారాలు చక్కబెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో… బుర్రిపాలెం అభివృద్ధి పనుల్లో.. ఇబ్బందుల్లాంటి వాటి విజ్ఞప్తులు స్వీకరించే బాధ్యత జగన్ సతీమణి తీసుకున్నట్లున్నారే విమర్శలు ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close