ప్యాకేజీకి ప‌డిపోయిన త‌మ‌న్నా

ఏదోలా త‌మ‌న్నా కెరీర్‌కి మ‌ళ్లీ ఊపొచ్చింది. రెండు సినిమాల్ని త‌న ఖాతాలో వేసుకొంది. అందులో నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ సినిమా ఒక‌టి. ఇంత‌లోనే జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ ప‌క్క‌న ఐటెమ్ సాంగ్ చేయ‌బోతోంద‌ని వార్త‌లొచ్చేశాయ్. జై ల‌వ‌కుశ‌లో త‌మ‌న్నా ఎంట్రీ దాదాపుగా ఖాయ‌మ‌న్న సంగ‌తి చిత్ర‌బృందం కూడా చూచాయిగా చెప్పేసింది. అయితే సంత‌కాలూ గ‌ట్రా జ‌ర‌గ‌లేద‌ట‌. కానీ ఒక్క‌టి మాత్రం నిజం. నంద‌మూరి స్పెష‌ల్ ప్యాకేజీకి త‌మ‌న్నా ప‌డిపోయింది. క‌ల్యాణ్ రామ్ సినిమాలో హీరోయిన్ + ఎన్టీఆర్ సినిమాలో ఐటెమ్ సాంగ్ అనే ప్యాకేజీ ప్రాతిప‌దిక‌న త‌మ‌న్నా క‌ల్యాణ్ రామ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ఆఫ‌ర్ విలువ దాదాపు కోటిన్న‌ర అని స‌మాచారం.

అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో ప్ర‌త్యేక గీతాల్లో క‌నిపించింది త‌మ‌న్నా. ఒక్కో పాట‌కూ రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకొంద‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. కొన్ని సినిమాల్లో ప్ర‌త్యేక గీతాల‌కు త‌మ‌న్నా పేరు ప‌రిశీలించారు. అయితే ఆ స్థాయిలో ఇవ్వ‌లేక – వేరే ఆప్ష‌న్‌ని ఎంచుకొన్నారు. జై ల‌వ‌కుశ‌లో ముగ్గురు ఎన్టీఆర్‌లు ఉన్న‌ప్ప‌టికీ హీరోయిన్ ఒక్క‌ర్తే. పైగా రాశీఖ‌న్నా ఏం ఫామ్ లో లేదు. స్టార్ హీరోయిన్ కూడా కాదు. ఈ సినిమాలో గ్లామ‌ర్‌ని యాడ్ చేయ‌డానికి త‌మ‌న్నా లాంటి ఐటెమ్ కావ‌ల్సివ‌చ్చింది. అందుకే క‌ల్యాణ్ రామ్ తెలివిగా ప్యాకేజీ మాట్లాడుకొని త‌మ‌న్నాని రంగంలోకి దించేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.