విడుదలకు ముందే అదరగొడుతున్న ‘నాన్నకు ప్రేమతో’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో.. మొదలైన నాటినుండి చాలా ప్రాముఖ్యత ఏర్పరచుకున్న ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో వస్తుందన్న సంగతి తెల్సిందే. మాస్ అభిమానులున్నఎన్టీఆర్ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అనే చక్కని టైటిల్ పెట్టి అందరు ఆశ్చర్య పోయేలా చేసిన సుక్కు.. సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడో కూడా ఫస్ట్ లుక్ లో చూపించి అభిమానులను అబ్బురపరిచాడు. ఇక దసరా కానుకగా విడుదల చేసిన టీజర్ అయితే సంచలనమే సృష్టించింది.

ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. అయితే సినిమా విడుదలకు ముందే నాన్నకు ప్రేమతో విడుదలకు ముందు వ్యాపారం బాగా చేస్తుంది. నైజాం ఏరియా 16 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నారని తెలుస్తుంది. ఈ మధ్య భారీ సినిమాలను విడుదల చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ వారే ఈ సినిమాను కూడా కొనడం విశేషం. ఓవర్సీస్ లో కూడా సినిమాను 7.10 కోట్లకు కొన్నారని వార్త. ఇక సీడెడ్ లో ఎన్టీఆర్ అన్ని సినిమాల కన్నా ఎక్కువగా దాదాపు 8.45 కోట్లకు సినిమా తీసుకున్నారని తెలుస్తుంది.

కేవలం మూడు ప్రాంతాల్లోనే ఈ సినిమా విడుదలకు ముందు వ్యాపారం 31 కోట్లకు చేసింది. ఇక మిగిలిన కోస్తా, కర్ణాటక, చెన్నై లను కూడా కలుపుకుంటే ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద సంచలనం సృష్టిస్తుందని అనాలి. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న షూటింగ్ ఇంకొద్ది రోజుల్లో కంప్లీట్ చేసుకోనుంది. వచ్చే నెల 13న భారీ ఎత్తున నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి పోరులో నిలుస్తున్న ఈ సినిమా విడుదల ముందు కొనసాగించిన హవానే విడుదల తర్వాత కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close