ఐటీ దాడులు ఏపీపై కక్ష సాధింపే..! : లోకేష్

ఏపీలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై… ఐటీ మంత్రి లోకేష్ స్పందించారు. ఐటీ దాడుల పేరుతో ఏపీపై కక్ష సాధిస్తున్నారని లోకేష్ తేల్చి చెప్పారు. 19 టీములతో .. 200 మంది అధికారులు దాడులు చేయడం ఎప్పుడైనా జరిగిందా అని లోకేష్ ప్రశ్నించారు. ఒకరిద్దరిపై గతంలోనూ ఐటీ దాడి చేస్తే పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా..? అని ప్రశ్నించారు.

ఐటీ దాడులు జరిగితే.. చంద్రబాబు వణికిపోతున్నారని.. మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించడం విడ్డూరమని.. ప్రతిపక్ష నేత జగన్ చేసిన విమర్సలపైనా లోకేష్ స్పందించారు. ఏపీలో పెట్టుబడులు పెడుతోన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తే మేం మాట్లాడకూడదా..? అని ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వారు కూడా విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడడమా..? అని ఎద్దేవా చేశారు. దేశంలోని టాప్-3 కంపెనీలు ఏపీకి వచ్చాయని గుర్తు చేశారు. భూముల కేటాయింపులపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. పెద్ద కంపెనీలకు భూములివ్వడం తప్పేమిటన్నారు. భూకేటాయింపులపై ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. ఇప్పటి వరకు మేం ఏడుసార్లు ఆస్తులు ప్రకటించాం.. ప్రతిపక్ష నేతలు కూడా ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొదట్లో లక్ష మందికి ఐటీ ఉద్యోగాలంటే అవహేళన చేశారు.. ఇప్పటికే 36 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. మరో 1.25 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.

గన్నవరంలో… హెచ్‌సీఎల్ సంస్థ భారీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన ేచసారు. ఆంధ్రప్రదేశ్ కి హెచ్ సీ ఎల్ రావడం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఒక స్టార్ట్ అప్ కంపెనీలా అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్నామని లోకేష్ వివరించారు. సింగపూర్, చైనా దేశాల్లా సంక్షోభాన్ని అవకాశం గా మార్చుకుంటున్నామన్నారు. ఏపీ విద్యార్థుల్లో ఐటీ స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని.. హెచ్ సీ ఎల్ యాజమాన్యం ప్రకటించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close