నాకు జగన్ లాగ జైలుకి వెళ్లాలని లేదు: లోకేష్

ఏపిలో వైకాపా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు మరిచిపోకుండా ఆయన కుమారుడు నారా లోకేష్ పేరుని కూడా చేరుస్తుంటారు. తెదేపా నేతలు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో జగన్ అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తుంటారు. వైకాపా నేతలు కూడా సరిగ్గా అదే విధంగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరినీ కలిపే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. రాజధాని భూముల నుంచి సదావర్తి భూముల వరకు ప్రతీ దానిలో పెద్దబాబు, చిన్నబాబు హ్యాండ్ ఉందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు విజయవాడలో పంజా సెంటర్ లో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అధ్వర్యంలో ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ (నిత్యావసర సరుకులు) పంపిణీ కార్యక్రమం జరిగింది. దానిలో పాల్గొన్న నారా లోకేష్ వైకాపా నేతల ఆరోపణలపై చాలా ఘాటుగా స్పందించారు. “ప్రతిపక్ష నేత (జగన్మోహన్ రెడ్డి) లాగ నాకు తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్ళాలని లేదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు. వాటిని నిరూపించి చూపితే నేనే జైలుకు వెళ్లి కూర్చోంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 64 ఏళ్ల వయసులో కూడా 16 ఏళ్ల పిల్లాడిలా చాలా హుషారుగా రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తుంటే ఆయనకీ సహకరించవలసినది పోయి అడుగడుగునా అడ్డుపడుతున్నారు,” అని లోకేష్ విమర్శలు గుప్పించారు.

తెదేపా నేతలు, మంత్రులు బినామీ పేర్లతో రాజధాని భూములని కొన్నారని వైకాపా ఆరోపించింది. దానిపై స్పందించిన మంత్రి నారాయాణ వైకాపా నేతలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత వైకాపా నేతలు ఆ భూముల గురించి మాట్లాడలేదు. మంత్రిగారు పరువు నష్టం దావా వేయలేదు.

మళ్ళీ ఇప్పుడు సదావర్తి సత్రవ భూములని తెదేపా నేతలు కొట్టేశారని వైకాపా ఆరోపిస్తోంది. వాటిలో చినబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కనుక ఆ ఆరోపణలు నిరూపించమని లోకేష్ సవాలు చేస్తున్నారు. బహుశః కొన్ని రోజుల తరువాత ఈ వ్యవహారం గురించి అందరూ మరిచిపోయి వేరే వ్యవహారం గురించి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవచ్చు.

దీనిని బట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే అధికార పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేయడం వరకే వైకాపా ఆసక్తి కనబరుస్తుంది తప్ప కోర్టుకి వెళ్లి దానిని నిరూపించే ప్రయత్నం చేయదని స్పష్టం అవుతోంది. అంటే రాజకీయ దురుదేశ్యంతోనే ఆరోపణలు చేస్తున్నట్లు అనుమానించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ తమపై అంత తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పుడు అది తప్పని నిరూపించుకొనే ప్రయత్నం తెదేపా ఎన్నడూ చేయ(లే)దు. కేవలం ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల నోళ్ళు మూయించాలని ప్రయత్నిస్తుంటుంది. అదే..ధైర్యంగా వాటిపై ప్రభుత్వం విచారణకి ఆదేశించి ఉంటే ప్రతిపక్షాలకి గట్టి సమాధానం చెప్పినట్లుండేది. కానీ ప్రతిపక్షాలు కోరినా సరే ఏనాడూ అందుకు అంగీకరించదు. అంటే వాటి ఆరోపణలలో ఎంతో కొంత నిజముందని నమ్మక తప్పదు. చివరికి అర్ధం అవుతున్నదేమిటంటే ఈ విమర్శలు, ఆరోపణలు, ప్రతివిమర్శలు అన్నీ కూడా ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయాయి తప్ప ఏవీ నిరూపించబడవు. ఎవరి అవినీతి భాగోతాలు బయటపడే అవకాశాలే ఉండవని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close