మోదీయే బీజేపీ – బీజేపీయే మోదీ..! 1977 నాటి కాంగ్రెస్ పరిస్థితే..!!

ఆకాశమే హద్దుగా ఎదిగిన బీజేపీ నాలుగంటే నాలుగేళ్లలో నేలబారుకి పడిపోయింది. భారతీయ జనతా పార్టీకి ఈ పరిస్థితి రావడానికి .. పూర్తిగా నరేంద్రమోదీ మీద ఆధారపడటమే కారణం. మోదీని పోస్టర్ బాయ్ గా పెట్టుకుని బీజేపీ ఎదిగే ప్రయత్నం చేసింది. కానీ ఓ వ్యక్తి ఇమేజ్ శిఖరంలా ఎదిగిన తర్వాత నేల చూపులు చూడటమే తప్ప… మరింత ఎదిగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం మోదీ పరిస్థితి కూడా అంతే. దేశంలో ఇక తిరుగులేదనుకున్న స్థితిలో నరేంద్రమోదీ… అటు పాలనలో.. ఇటు రాజకీయాల్లో నియంత లాంటి ప్రవర్తనకు అలవాటు పడ్డారు. ఫలితంగా… బీజేపీని వ్యతిరేకించే… ముఖ్యంగా నరేంద్రమోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకమయ్యాయి.

తమ మధ్య తరతరాల వైరుధ్యమున్నా… పక్కన పెట్టి.. మోదీపై పోరాటానికి ఎక్కువయ్యాయి. గడ్డిపోచలు మదగజాన్ని కూడా బంధించగలవని నిరూపించేందుకు ముందడుగు వేస్తున్నాయి. మోదీ ప్రస్తుత పరిస్థితిని .. కొంత మంది విశ్లేషకులు…1977లో ఇందిగాంధీతో పోలిస్తున్నారు. ఇండియాయే ఇందిర.. ఇందిరయే ఇండియా అన్న ప్రచారం ఓ రేంజ్ లో జరిగిన తర్వాత.. ఇందిరా గాంధీ… తనకు ఎదురుతిరిగిన పరిస్థితులను ఆహ్వానించలేకపోయారు. 1975లో ఎమర్జెన్సీ విధించారు. 1977లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇందిరాగాంధీ స్వయంగా నిర్ణయించుకునేవరకూ..ఈ ఎమర్జెన్సీ సాగింది. ఇందిర నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా.. దేశంలోని చిన్నాచితకా పార్టీలన్నీ ఏకమయ్యాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేదు. జనతాపార్టీనే ఓ మాదిరి బలంగా ఉంది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా ఆ ఎన్నికలను విపక్షాల్ననీ కలసి కట్టుగా ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది.

అప్పుడు ఇందిరాగాంధీ బలంగా లేని విపక్ష పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు నరేంద్రమోదీ… దాదాపుగా ప్రతీ రాష్ట్రంలోనూ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పోరాడుతున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. నరేంద్రమోదీని అధికారంలో నుంచి దింపేయాలన్న ఏకైక అజెండాను పెట్టుకున్నాయి. బెంగళూరు వేదికగా… కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ వేడుకలో… బలప్రదర్శన కూడా చేశాయి. ఇది ఒక్క సందర్భానికే కాదని.. ఆయా పార్టీల నేతలు… అవకాశం వచ్చినప్పుడల్లా చేతల్లో కూడా చూపిస్తున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీల కూటమి… బీజేపీకి దాదాపుగా చెక్ పెట్టేసింది.

యూపీలో పట్టు కోల్పోతే..మోదీ మళ్లీ ప్రధాని కావడం అసాధ్యమే.భారతీయ జనతా పార్టీ.. వ్యక్తిపై ఆధారపడి … నియంతృత్వ ధోరణులతో.. విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యేలా బీజేపీనే చేసుకుంది. ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షమంటూ లేని పరిస్థితి. ప్రస్తుతం కూటమిలో ఉన్న శివసేన, జేడీ యూ కూడా.. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసే గ్యారంటీ లేదు. అంటే మోదీ ఒక వైపు.. దేశం మొత్తం ఒకవైపు అన్నట్లుగా పరిస్థితి మారనుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close