మోడీ గుంటూరు సభ వాయిదా వేసుకునే యోచనలో బీజేపీ..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గుంటూరులో ఆరో తేదీన బహిరంగసభలో ప్రసంగించాల్సి ఉంది. ఈ మేరకు ఉన్నత స్థాయిలో షెడ్యూల్ ఖరారయింది. ఏపీ బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే హఠాత్తుగా నరేంద్రమోడీ పర్యటన వాయిదా పడే అవకాశం ఉందన్న సమాచారన్ని ఢిల్లీ బీజేపీ వర్గాలు మీడియాకు లీక్ చేస్తున్నాయి. దానికి విచిత్రమైన కారణాలను బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆరో తేదీన కేరళలో బహిరంగసభ ఉందని.. అక్కడ్నుంచి గుంటూరు రావడానికి సమయం సరిపోదని.. చెబుతున్నాయి.

షెడ్యూల్ ప్రకారం మోదీ జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పర్యటించాల్సి ఉంది. ముందుగా తిరువనంతపురంలో జరిగే సభలో పాల్గొని అనంతరం గుంటూరు వస్తారు. అయితే కేరళ బీజేపీ సభను మోడీ సభను తిరువనంతపురంలో కాకుండా శబరిమలలో పెట్టాలని కోరుతోందట. అలా మారిస్తే… బహిరంగ సభ ముగిసిన తర్వాత గన్నవరం రావడానికి మోడీకి సమయం సరిపోదని చెబుతున్నారు. హెలికాఫ్టర్లు, విమానాల ద్వారా మాత్రమే ప్రధాని పర్యటన సాగుతుంది. మరి ఎక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందో బీజేపీ నేతలు చెప్పడం లేదు కానీ… కేరళ బహిరంగసభ వేదికను మారిస్తే… మోడీ గుంటూరు రారని మాత్రం చెబుతున్నారు.

నిజానికి మోడీ పర్యటనపై.. మరో ఆలోచన లేకపోతే.. వాయిదా అనే సమాచారమే లీక్ అవ్వడానికి అవకాశం లేదు. ఇలాంటి సమాచారం బయటకు వచ్చిందంటే.. దాదాపుగా వాయిదా పడినట్లే. ఏపీకి మోడీ వస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని…బీజేపీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. వైసీపీ, జనసేన మినహా.. పార్టీలు, ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తామని… ఇప్పటికే ప్రకటించాయి. గతంలో మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు.. వారు వ్యక్తం చేసిన నిరసన దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. అలాంటి పరిస్థితులు ఏపీలో ఏర్పడితే.. ఇబ్బందికరం అవుతుందన్న ఉద్దేశంతో… మోడీ టూర్‌ను వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close