ఇరవై వేల టన్నుల బంగారం ఇళ్ళల్లో పడి మూలుగుతోంది!

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మూడు బంగారం డిపాజిట్ పథకాలను ఇవాళ ప్రవేశపెట్టింది. దేశంలో రు.5,40,000 కోట్ల విలువ చేసే 20 వేల టన్నుల బంగారం వృథాగా ఇళ్ళలో పడి మూలుగుతోందని, ఈ పథకాల ద్వారా ఆ బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(జీఎంఎస్), గోల్డ్ సావరిన్ బాండ్, గోల్డ్ కాయిన్ అనే ఈ మూడు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇవాళ ఢిల్లీలో ప్రారంభించారు. మొదటి పథకంలో బంగారం డిపాజిట్‌లపై వడ్డీ ఇస్తారు… రెండో పథకంలో గోల్డ్ బాండ్‌లను విడుదల చేశారు. మూడో పథకంలో భాగంగా మొట్టమొదటి భారత గోల్డ్ కాయిన్‌ను మోడి ఆవిష్కరించారు. బంగారం దిగుమతులను తగ్గించి, విదేశీమారకాన్ని పెంచే లక్ష్యంతో కాయిన్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఏటా 1,000 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అవుతోంది. ఇవాళ విడుదల చేసిన గోల్డ్ కాయిన్‌లపై ఒకవైపు అశోకచక్రం, మరోవైపు మహాత్మా గాంధి బొమ్మలను ముద్రించారు. వీటిని 5, 10, 20 గ్రాముల బరువులో విడుదల చేశారు. బంగారం వినియోగంలో భారత్ చైనానుకూడా అధిగమించి ప్రథమస్థానానికి చేరుకుందని మోడి అన్నారు. దేశంలో ఈ ఏడాది 562 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. భారతదేశం పేదదేశంగా మిగిలిపోవాల్సిన అవసరంలేదని, మరి కొద్ది కృషి, సరైన విధానాల ద్వారా భారత్ పేద ముద్రను వదిలించుకోవచ్చని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close